తల్లిని కడసారి చూసేందుకు.. ఓ యువకుడి సాహసం

కరోనా రక్కసి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలను బలితీసుకుంటోంది. కరోనాతో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఉద్వేగానికి గురిచేస్తోంది....

Published : 26 Apr 2021 20:14 IST

కలబురిగి: కరోనా రక్కసి కుటుంబాలకు కుటుంబాలను బలితీసుకుంటోంది. ఎందరికో శోకం మిగులుస్తోంది. కరోనాతో మరణించిన తల్లిని కడసారి చూసేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఉద్వేగానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని కలబురిగి జిల్లాకు చెందిన యువకుడు కొవిడ్ బారిన పడిన తన తల్లిని కరోనా ఆసుపత్రిలో చేర్చించాడు. వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ తల్లి ఆదివారం మృతి చెందింది. మృతురాలిని చివరి సారిగా చూసేందుకు వచ్చిన  కొడుకును ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. తన తల్లిని ఎలాగైనా చూడాలని సంకల్పించిన ఆ యువకుడు ఏకంగా ఆసుపత్రి భవనం ఎక్కాడు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని