Jharkhand: పురిటినొప్పులతో మహిళ ఆవేదన.. మంచాన్నే డోలీగా చేసి ఆసుపత్రికి తరలింపు!

మారుమూల ప్రాంతాల్లో సరైన రోడ్డు వసతి లేక ప్రజలు అవస్థలు పడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఝార్ఖండ్‌లో జరిగిన సంఘటన హృదయాలను కలచివేస్తోంది.

Published : 05 Jan 2022 23:38 IST

రాంచీ: మారుమూల ప్రాంతాల్లో సరైన రోడ్డు వసతి లేక ప్రజలు అవస్థలు పడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఝార్ఖండ్‌లో జరిగిన సంఘటన హృదయాలను కలచివేస్తోంది. హజారీబాగ్ గ్రామానికి చెందిన గుడియా దేవి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో మంచాన్ని డోలీలా చేసి.. భుజాలపై 2 గంటలపాటు మోసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో.. రోడ్డు మార్గానికి చేరుకున్న తర్వాత కారులో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు నిర్మించాలని జిల్లా యంత్రాంగానికి ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళను డోలీలో తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని