Tamil Nadu: పెంపుడు శునకానికి సీమంతం.. వీడియో వైరల్‌!

ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి ఓ కుటుంబం సీమంతం చేసిన ఘటన తమిళనాడులో జరిగింది.

Published : 06 Dec 2021 18:21 IST

మథురై: ప్రేమగా పెంచుకుంటున్న శునకానికి ఓ కుటుంబం సీమంతం చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. మధురైలోని  జైహింద్‌పూర్  పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న శక్తివేల్‌కు తాను పెంచుకునే శునకం అంటే అమితమైన ఇష్టం. ముద్దుగా సుజీ అని పిలుచుకుంటున్న ఈ శునకం గర్భం దాల్చింది. కుమార్తెగా భావించి ఆ శునకానికి శక్తివేల్ ఘనంగా సీమంతం నిర్వహించారు. శునకానికి దండ, గాజులు వేసి హారతి పట్టారు. అనంతరం స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేసి శునకంపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారాయి. శునకంపై శక్తివేల్ కుటుంబానికి ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Read latest Viral Videos and Telugu News



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని