ఇన్‌స్పెక్టర్‌ సాహసం.. మహిళ ప్రాణాలు సురక్షితం

ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళ  రైలు పట్టాలపై దూకగా.. ఓ పోలీసు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు. ముంబయిలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్న ఓ మహిళను పోలీసులు పట్టుకునేందుకు వస్తున్నారని బయపడి రైలు పట్టాలపై దూకే ప్రయత్నం చేసింది. ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌ కన్వత్‌

Published : 29 May 2021 23:33 IST

ముంబయి: ఓ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళ  రైలు పట్టాలపై దూకగా.. ఓ పోలీసు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు. ముంబయిలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ మీద ఉన్న ఓ మహిళను పోలీసులు పట్టుకునేందుకు వస్తున్నారని బయపడి రైలు పట్టాలపై దూకే ప్రయత్నం చేసింది. ఇన్‌స్పెక్టర్‌ అర్జున్‌ కన్వత్‌ ఆమెను నిలువరించే ప్రయత్నం చేసినా.. ఆయన చేయిజారడంతో సదరు మహిళ రైలు పట్టాలపై దూకేసింది. వెంటనే అర్జున్‌ కూడా రైలు పట్టాలపై దూకి ఆమె ప్రాణాలు కాపాడారు. అర్జున్‌ కన్వత్‌ ధైర్యాన్ని పోలీసులు, ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని