వాటిని ఎదుర్కోవాలంటే ఇవి తప్పవు..!

కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణ ధాన్యాలు, పెరుగు.. తదితర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో- అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో- ఇమ్యూనిటీని పెంచే బలవర్ధకమైన ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Published : 07 Feb 2022 19:00 IST

కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణ ధాన్యాలు, పెరుగు.. తదితర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో- అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో- ఇమ్యూనిటీని పెంచే బలవర్ధకమైన ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో- ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంపై దృష్టి పెట్టక తప్పదు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!

* శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో పండ్లు, కూరగాయలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, ఫైటో న్యూట్రియంట్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

* పుల్లటి పండ్లలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి నిమ్మ, బత్తాయి, కమలా పండ్లను అధికంగా తీసుకుంటే మంచిది. వీటితో పాటు  బొప్పాయి, జామ, యాపిల్‌, ద్రాక్ష,  తదితర పండ్లను కూడా తీసుకోవాలి.

* పెరుగులో పలు సూక్ష్మ పోషకాలుంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌ లాంటి వ్యాధికారక క్రిములను నశింపజేస్తాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇక పెరుగును రోజూ తీసుకుంటే అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

* ప్రాసెస్డ్‌ ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్ల రసాలను కూడా పరిమితంగా తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌, కార్బొనేటెడ్‌ పానీయాలకు స్వస్తి చెప్పండి.

* చికెన్‌, మటన్‌, గుడ్లు.. మొదలైనవాటిని తినేముందు బాగా శుభ్రం చేసుకుని, పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి.

* ఏ రూపంలో అయినా సరే- రోజూ కచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు శరీరానికి అందాలి.

* చేపలు, పీతలను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా పీతల్లో జింక్‌ లాంటి సూక్ష్మ పోషకాలు ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* కొవ్వు పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి (రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ ఫ్యాట్‌ తీసుకోకూడదు).

* ఉప్పును మితంగా వాడండి (రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ వాడరాదు).

* చక్కెర పదార్థాలను కూడా తగ్గించండి.

* మద్యపానం, ధూమపానం అలవాటున్న వారు ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది.

* మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వైద్య నిపుణులు సూచించిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

* వీటితో పాటు వంట చేయడానికి ముందు, తినే ముందు చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి.  అలాగే వ్యక్తిగత పరిశుభ్రత గురించి విడిగా చెప్పక్కర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్