ఇలా చేస్తే ‘ఫుడ్‌ పాయిజనింగ్‌’ అవుతుందట!

బయటి నుంచి తెచ్చిన పండ్లు, కాయగూరలపై వ్యాధికారక క్రిములుంటాయని.. వాటిని ఇంటికి తీసుకురాగానే శుభ్రం చేస్తుంటాం. అయితే మనం ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోయినా వాటిలో సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయని, అది క్రమంగా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీస్తుందని చెబుతోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అందుకే పదార్థాల్ని నిల్వ చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

Updated : 27 Jun 2021 12:59 IST

బయటి నుంచి తెచ్చిన పండ్లు, కాయగూరలపై వ్యాధికారక క్రిములుంటాయని.. వాటిని ఇంటికి తీసుకురాగానే శుభ్రం చేస్తుంటాం. అయితే మనం ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోయినా వాటిలో సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయని, అది క్రమంగా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీస్తుందని చెబుతోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అందుకే పదార్థాల్ని నిల్వ చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అదెలాగో తెలియజేస్తూ ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా పలు మార్గదర్శకాలను సైతం జారీ చేసిందీ సంస్థ.

ఫుడ్‌ పాయిజన్‌కు కారణాలివే!

సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వండిన ఆహార పదార్థాలను రోజంతా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినా ఏమీ కాదనుకుంటాం. కానీ అలాంటి పదార్థాలు మనకు తెలియకుండానే కలుషితమయ్యే ప్రమాదం ఉందంటోంది FSSAI.

* వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాల్ని రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. అది కూడా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి.

* ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

* ఆహారం వండి వార్చే క్రమంలో సరైన పరిశుభ్రతా ప్రమాణాల్ని పాటించకపోయినా ఈ సమస్య తలెత్తుతుంది.

* పచ్చి మాంసంపై ఉండే ఈ.కొలి, ఇతర బ్యాక్టీరియా ఫుడ్‌ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ఇతర కాయగూరలు, పండ్లతో కాకుండా విడిగా తీసుకురావాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

రుచికి బాగానే ఉన్నా.. కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి చెందిన ఇలాంటి కలుషితమైన ఆహారం తినడం వల్ల వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్‌.. వంటి సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే ఫుడ్‌ పాయిజనింగ్‌ కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

* ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

* వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

* వండే ముందు, తర్వాత కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

* పదార్థాల్ని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తినడమే మంచిది. తద్వారా వాటిపై ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడచ్చు.

* మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరల్ని ముందుగా ఉప్పు/పసుపు వేసిన నీటిలో కడగడం ఉత్తమం. అలాగే క్యాలీఫ్లవర్‌, బ్రకలీ వంటి వాటిని వండే ముందు ఉప్పు నీటిలో కాసేపు ఉడికించడం మరీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్