తేనెలూరే అందం

పొడి చర్మతత్వం ఉన్నవారు పచ్చి పాలల్లో చెంచా తేనె కలిపి స్నానానికి ముందు ఒంటికి రాసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. చర్మానికి తేమ అంది మేను మెరుపును సంతరించుకొంటుంది.* కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి చర్మంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఇవి శరీరంపై పేరుకొని చర్మం బరకగా అనిపిస్తుంది. మృత కణాలూ పెరిగిపోతాయి. అందుకే టేబుల్‌ స్పూను తేనెలో అరస్పూన్‌ బాదం ముద్ద, చెంచా ని

Updated : 30 Jul 2021 04:46 IST

అందరికీ అందుబాటులో ఉండేది తేనె. ఇది ఆరోగ్యానికే కాదు... చర్మ సౌందర్యానికీ మంచిదే.

* పొడి చర్మతత్వం ఉన్నవారు పచ్చి పాలల్లో చెంచా తేనె కలిపి స్నానానికి ముందు ఒంటికి రాసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలు. చర్మానికి తేమ అంది మేను మెరుపును సంతరించుకొంటుంది.

* కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి చర్మంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఇవి శరీరంపై పేరుకొని చర్మం బరకగా అనిపిస్తుంది. మృత కణాలూ పెరిగిపోతాయి. అందుకే టేబుల్‌ స్పూను తేనెలో అరస్పూన్‌ బాదం ముద్ద, చెంచా నిమ్మరసం కలుపుకొని ముఖానికి పట్టించి మృదువుగా రుద్దాలి. పది నిమిషాలు ఇలా చేశాక గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకొంటే సరి.

*చర్మం సాగి ముడతలు పడితే వయసు మీరినట్లుగా కనిపిస్తారు. దీనికి పరిష్కారంగా టేబుల్‌ స్పూను తేనెలో, తెల్లసొన, చెంచా గ్లిజరిన్‌, మూడు చెంచాల బియ్యం రవ్వ కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం నవయౌవన కాంతిని పొందుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్