మృదువైన పాదాలు కావాలా!

చలికాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పాదాల పగుళ్లు. కొందరిలో ఇవి తీవ్రంగా ఉండి, అడుగే వేయలేని స్థితి కనిపిస్తుంటుంది. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు..

Updated : 04 Dec 2021 06:23 IST



చలికాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య పాదాల పగుళ్లు. కొందరిలో ఇవి తీవ్రంగా ఉండి, అడుగే వేయలేని స్థితి కనిపిస్తుంటుంది. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు..

పాదాల పగుళ్లకి ముఖ్య కారణం మురికి చేరడంతోపాటు పొడి బారడమే. కాబట్టి, రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్‌ రాయాలి. టబ్‌లో పాదాలు మునిగేలా గోరు వెచ్చని నీటితో నింపి, రెండు చెంచాల తేనె వేసి పాదాలను ఉంచాలి. పది నిమిషాలయ్యాక పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. ఇది సహజసిద్ధ మాయిశ్చరైజర్‌లా పని చేయడమే కాదు, బ్యాక్టీరియానూ దూరం చేస్తుంది.

* మర్దన.. కొబ్బరి నూనెలో పసుపు కలిపి పగుళ్లున్న చోట లేపనంలా రాయాలి. దీంతో వాపు, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. రోజూ రాత్రి కొబ్బరినూనెతో మృదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. మర్దన తర్వాత కాటన్‌ సాక్సు వేసుకుంటే మృదువుగా మారతాయి. ఈ సీజన్‌లో బయటికి వెళ్లినప్పుడూ సాక్సు ధరిస్తే మంచిది.

* పాదరక్షలు.. మెత్తని, వదులైన వాటికే ప్రాధాన్యమివ్వాలి. హీల్స్‌ వంటివి పాదాలపై ఒత్తిడిని పెంచుతాయి. దానికి చలిగాలులు తోడైతే పగుళ్లు మొదలవుతాయి.

* క్రీం.. ఫుట్‌కేర్‌ క్రీం దొరుకుతోంది. సాల్‌ ట్రీ, మెంతులతో చేసినవి బాగా పనిచేస్తాయి. రోజుకి రెండుసార్లు రాస్తే సరి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పాదాలను ఆరోగ్యంగా ఉంచి పగుళ్ల నుంచి కాపాడతాయి. కాళ్లు శుభ్రం చేసుకోవడానికీ గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్