పేదింటి అమ్మాయిల్ని కాలేజీకి పంపిస్తోంది!

ఆమె వయసు 33. అయినా ఇప్పటివరకు 300మంది నిరుపేద చిన్నారులను విద్యావంతులను చేసింది. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ఉన్నత చదువువైపు అడుగులేసేలా చేస్తున్న సుజితకు ఈ ఆలోచనెలా వచ్చిందో తెలుసుకుందాం.

Updated : 30 May 2022 07:47 IST

ఆమె వయసు 33. అయినా ఇప్పటివరకు 300మంది నిరుపేద చిన్నారులను విద్యావంతులను చేసింది. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ఉన్నత చదువువైపు అడుగులేసేలా చేస్తున్న సుజితకు ఈ ఆలోచనెలా వచ్చిందో తెలుసుకుందాం.

గేబ్రియల్‌ కళ్లు తెరిచిన మూడు నెలలకే తండ్రి చనిపోయాడు. ఈమె తల్లి  కూలీగా పనిచేస్తూ తన ఒక్కగానొక్క ఆడపిల్లను చదివించాలని అహోరాత్రులు కష్టపడేది. నెలకు రూ.6వేల ఆదాయంతో ఇబ్బందులెన్నొదురైనా కూతురిని పెంచింది. రామనాధపురానికి చెందిన గేబ్రియల్‌కు చిన్నప్పటి నుంచి పెద్దచదువులపై ఆసక్తి. ఇంటర్‌లో 500కు 470 మార్కులు సాధించింది. ఆ తర్వాత డిగ్రీలో చేరాలనుకున్నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఈ అమ్మాయి గురించి సామాజిక సేవాకార్యకర్తగా పేరుపొందిన సుజితకు తెలిసింది. ఆ అమ్మాయి కలను నెరవేర్చడానికి ముందడుగు వేసింది. క్రౌడ్‌ ఫండ్‌ సాయంతో గేబ్రియల్‌కు కాలేజీ, హాస్టల్‌ ఫీజులు కట్టడంతోపాటు తిరుచ్చి కాలేజీకి పంపడానికి ఆమె తల్లిని కూడా ఒప్పించింది. అలా గేబ్రియల్‌లాంటి పేద విద్యార్థినులకు విద్యనందించడమే లక్ష్యంగా పెట్టుకొంది సుజిత.

చదివేటప్పుడే..  చాలా కుటుంబాలు ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు తమ ఆడపిల్లల చదువులను నిరభ్యంతరంగా నిలిపేస్తాయి అంటుంది సుజిత. ‘అటువంటి పిల్లలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంటా. అలా డ్రాపవుట్్సగా మారినవాళ్లను కనిపెట్టి చదువుపై వారికున్న ఆసక్తి తెలుసుకుంటా. అటువంటివారికి దాతల ద్వారా ఆర్థికసాయం అందేలా చేసి తిరిగి బడివైపు అడుగులేసేలా చేస్తా. పీజీ చేసేటప్పుడు తమిళనాట చాలా గ్రామాలు తిరిగేదాన్ని. వారి ఇబ్బందులు తెలుసుకొని, సాయం అందించాలని కోరుతూ.. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసేదాన్ని. చదువులోనే కాదు, అనారోగ్యంతో చికిత్స చేయించుకోవడానికి వైద్యఖర్చుల్లేని వారికి ఆన్‌లైన్‌ ఫండింగ్‌ అందేలా చేస్తుంటా. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వాళ్లను చూసొచ్చి వారి అవసరాన్ని తీర్చడానికి కృషి చేసేదాన్ని’ అని చెప్పుకొస్తోంది సుజిత.

లాక్‌డౌన్‌లో... కొవిడ్‌ సమయంలో చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ‘స్మార్ట్‌ఫోన్స్‌ లేక ఆన్‌లైన్‌ తరగతులకు గ్రామాల్లో చాలామంది హాజరు కాలేకపోయారు. వారంతా డ్రాపవుట్స్‌గా మారేవారు. అటువంటివారిని గుర్తించి, తిరిగి పాఠశాల వైపు నడిపించగలిగా. ఇదంతా జరగడానికి దాతల సాయమే కారణం. సామాజిక మాధ్యమాల్లో వీరి గురించి చెబుతూ సాయం అందించమనేదాన్ని. పలు ఎన్జీవోలు, ఆర్థిక చేయూతనందించే వలంటీర్ల నుంచి సహాయనిధి రూ.7లక్షలు వరకు అందింది. దీన్నంతా పేద పిల్లల చదువుల కోసమే వినియోగించా. సాయమంతా ఆన్‌లైన్‌లోనే జరిగేలా చేసి, ప్రతి దాతకూ లబ్ధిదారుల వివరాల్ని తెలియజేసేదాన్ని. అలా ఇప్పటివరకు దాదాపు 300 మంది విద్యార్థులను తిరిగి చదువుకునేలా చేయగలిగా. ఓసారి నేత్రసంబంధిత వ్యాధి కారణంగా చూపు కోల్పోతున్న ఓ అనాధ విద్యార్థినికి శస్త్రచికిత్స చేపట్టడానికి పలువురు వైద్యులను అడిగితే ఫలితం ఉండదన్నారు. ఈ అంశాన్ని సోషల్‌మీడియాలో పొందుపరిచి ఈ విద్యార్థినికి వైద్యులు తిరిగి చూపు తెప్పించాలని కోరా. ఆ పోస్ట్‌ చూసిన రాధాత్రి నేత్రాలయకు చెందిన ఓ వైద్యుడు ముందుకొచ్చి, తాను ఉచితంగా చికిత్స చేస్తానన్నారు. కొందరు వలంటీర్ల సాయంతో ఆమెను ఆసుపత్రికి చేర్చగా చికిత్స నిర్వహించి తిరిగి చూపు వచ్చేలా చేశారు’ అని చెప్పుకొస్తున్న సుజిత భవిష్యత్తులో మరికొందరి ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చేలా చేయడానికి కృషి చేస్తానంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది
ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది
సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి
ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!
ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!
నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి
‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!
‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!
పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి
కథ చెబుతాను... ఊ కొడతారా..!
కథ చెబుతాను... ఊ కొడతారా..!
రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి
చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!
చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!
ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్