
మౌనమెందుకు.... మేలుకో!
శిరీష (పేరుమార్చాం) భర్త పనిచేసే సంస్థ మూతపడటంతో అతని ఉద్యోగం పోయింది. ఆమె వర్క్ఫ్రమ్ హోం చేస్తోంది. అది అతనికి చిన్నతనంగా ఉంది. భార్య విధులు నిర్వర్తించే సమయంలోనే... పనులు చెప్పేవాడు. కాస్త ఆలస్యమైతే సూటిపోటి మాటలనేవాడు. ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడిలో మార్పురాలేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది.
‘నా భర్త నన్ను తన అవసరాలను తీర్చే యంత్రంలా మాత్రమే చూస్తాడని’ బాధపడుతోంది నలభై ఐదేళ్ల లక్ష్మి. భర్త ఇన్నాళ్లూ ఆఫీసు పనులతో తీరిక లేకుండా ఉండేవాడు. ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ... అభద్రత, ఆందోళన ఆమెను నిత్యం వెంటాడుతున్నాయి. అతడు ఆమె చేసే ప్రతిపనిలోనూ లోపాలు వెతుకుతోంటే... కుంగిపోతోంది.
నిత్యది ప్రేమ పెళ్లి కావడంతో పుట్టింటి వాళ్లకు దూరమైంది. భర్త అరకొర జీతంతో ఇల్లు గడవడం కష్టమైంది. ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త చేయిచేసుకుంటుంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి..
181 హెల్ప్లైన్కి గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ తెలంగాణలో 10,338 గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ సంఖ్య 1103గా ఉంది.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే... అసలు ఇతరులతో చెప్పుకోలేని మరెన్నో సమస్యలతో కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు స్త్రీలు. గతంలో కంటే... కరోనా వచ్చాక పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.
మార్పు దిశగా అడుగేయండి...
మాట వినడం లేదంటారు ఒకరు... ఉద్యోగం పోయిందని ఒకరు, మద్యం దొరకట్లేదని మరొకరు...ఒత్తిడిని అదుపులో ఉంచుకోలేక అదుపు తప్పుతున్నారు. మాటల్ని తూటాల్లా ఒకరు విసిరితే... చేతినే ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఇంకొకరు. చిన్న విషయాలే...తుఫానులా మారుతున్నాయి. వెరసి మహిళలపై హింసకు కారణమవుతున్నాయి.
నిజానికి గృహహింస మనదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య పెరిగింది. ‘కౌన్సిల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్’ జరిపిన అధ్యయనంలో తేలిందేంటంటే... ప్రపంచవ్యాప్తంగా సగటున 8.1శాతం గృహహింస పెరిగింది. మన జాతీయ మహిళా కమిషన్ నుంచి యునిసెఫ్ వరకు అందరిదీ ఇదే మాట.
కుటుంబ సమస్యల్ని అధిగమించడం అంత సులువైన పనికాదు. కానీ మన చుట్టూ ఉండే వాతావరణంలో కొన్ని మార్పులు చేసుకోగలిగితే.. నియంత్రణలో ఉంటాయి. ఆడవాళ్లకు పరిధులు గీసే ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. మహిళలు కూడా కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. మార్పు కోసం ఇద్దరూ ముందడుగు వేయాలి. అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవడం, బాధ్యతల్ని పంచుకోవడం, ఎదుటివారికి వ్యక్తిగత సమయాన్ని ఇవ్వగలగడం వంటి వాటి ద్వారా ఉపశమనం లభిస్తుంది.
*కుటుంబంలో సమస్యలు సహజమే అయినా... అవి సర్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉంటే మధ్యవర్తి సాయం తీసుకోవడానికి వెనకాడొద్దు. ఈ విషయంలో మొదట ఇరువైపుల పెద్దల సాయం తీసుకోండి. ఈ క్రమంలో బాధితురాలికి కుటుంబం, సన్నిహితుల సహకారం ఎంతో అవసరం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే... భరోసా కేంద్రాలు, వన్స్టాప్ సెంటర్లు, ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రాల సాయం తీసుకోండి. నిపుణుల సలహాలతో మీ సమస్య పరిష్కారం కావొచ్చు.
మనదేశంలో గృహ హింసకి సంబంధించిన ఫిర్యాదులను జాతీయ మహిళా కమిషన్ వాట్సాప్ నెంబర్: 72177-35372లో లేదా ఆ సంస్థ వెబ్సైట్లో ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాధితులెవరైనా 181, 100 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే తక్షణం సంబంధిత పోలీస్స్టేషన్కు ఆ సమాచారం చేరుతుంది. వారు బాధిత మహిళలను కాపాడతారు.
షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాలు.. తెలంగాణలో స్త్రీల రక్షణకోసం నిరంతరం పనిచేస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లలో ఇమీడియట్ రెస్పాన్స్ టీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మహిళా పెట్రోలింగ్ పోలీసు బృందాలు తక్షణం అక్కడకు చేరుకుంటాయి. కౌన్సెలింగ్ చేయడం, అవసరమైతే బాధితులకు పునరావాసం కల్పించడం వంటివి చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో దిశ పోలీస్స్టేషన్లు, వన్స్టాప్ కేంద్రాలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు మహిళలపై హింసను నిరోధించేందుకు సాయం చేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో ఉచిత న్యాయ, వైద్య, పోలీస్ సేవలు అందుతాయి. ఇవి కాక రెండు రాష్ట్రాల్లోనూ భూమిక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 18004252908 ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్లో మైఛాయిస్, షాహీన్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఆన్లైన్లో ‘ఇన్విజిబుల్ స్కార్స్’ వంటి వేదికల్లోనూ మీ బాధల్ని చెప్పుకోవచ్చు.
మాట్లాడితేనే బయటపడగలరు...
- అనసూయ, డీసీపీ, సైబరాబాద్
ఇంటి నుంచే పని చేసే సంస్కృతి, ఆర్థిక ఒత్తిళ్లు, పనిభారం వంటివి ఇప్పుడు కుటుంబాల్లో కొత్త చిచ్చుల్ని పెడుతున్నాయి. దాంతో శారీరక, లైంగిక, మానసిక వేధింపులు పెరిగాయి. గతంలో ఎప్పుడైనా అత్తింట్లో ఏదైనా సమస్య తలెత్తితే అమ్మకో, అక్కకో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు బయటకెళ్లే పరిస్థితులు లేవు. పోనీ ఫోన్లో మాట్లాడదామంటే... భర్త, అత్తమామలు వింటే ఏం గొడవోననే భయం. అన్నీ కలిసి ఆమె నోరు నొక్కేస్తున్నాయి. దాంతో మహిళ కుంగుబాటుకి గురవుతుంది. సర్దుకోలేని సమస్య అయినప్పుడు, అది హింసకు దారితీస్తున్నప్పుడు మౌనంగా ఉండొద్దు. మీ బాధ పంచుకునేందుకు పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉంది.
కౌన్సెలింగ్కి వెళ్లండి...
- డా. సుజాత గాదె, సైకాలజిస్ట్
కరోనా ఉన్నా... లేకున్నా ఇందుకు మద్యం ఓ ప్రధాన కారణం. మత్తులో దాడికి పాల్పడే వారేకాదు... ప్రస్తుతం మందుకి దూరం కావడం వల్ల కూడా విపరీత మానసిక ప్రవర్తనతో ఇబ్బంది పెట్టేవారి సంఖ్యా పెరిగింది. సాధారణంగా ఒత్తిడితో మహిళలు మాటతో దురుసుగా ప్రవర్తిస్తే, మగవారు శారీరక బలాన్ని చూపిస్తుంటారు. నాలుగు దెబ్బలు కొట్టగానే... దాచుకున్న డబ్బు ఇచ్చేస్తారు. లైంగిక అవసరాల్ని తీరుస్తారు. అలా ప్రస్తుతం హింసను రెట్టింపు స్థాయిలో భరిస్తున్నారు. మీ మనోబలాన్ని దెబ్బతీసుకోవద్దు. సంకోచించకుండా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ని సంప్రదించండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

ఆ ఎర్ర గుర్తు మహిళలకు రక్ష
రోడ్డు మీద వెళుతోంటే.. వెకిలి వ్యాఖ్యలు. రద్దీ ప్రదేశాల్లో ఎక్కడ్నుంచో చాటుగా తాకే చెడు స్పర్శ. బయటకు వెళ్లే ప్రతి అమ్మాయి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేవే ఇవన్నీ. అయితే ఫిర్యాదు చేసేవారెందరు? ఎక్కువ శాతం మంది చిన్న విషయంగా భావించి వదిలేస్తారు. ఈ వాతావరణాన్ని మార్చాలనుకుంది ఎల్సా మేరీ డిసిల్వా. అందుకోసం అత్యున్నత ఉద్యోగాన్నే వదులుకుంది. ఇప్పుడు ఎన్నో దేశాలు అమ్మాయిల భద్రత విషయంలో ఆమె సాయం కోరుతున్నాయి...తరువాయి

సహోద్యోగులతో కలిసిపోయేదెలా?
కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఆరోగ్యకరమైన, వాస్తవిక అంచనాలను ఏర్పరచుకోవాలి. బృంద సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మొదట్లో మెప్పు పొందాలని చాలామంది ప్రతి పనినీ స్వీకరిస్తారు. మంచిదే.. కానీ కొన్ని నియమాలను పెట్టుకోండి. బృందానికి సాయాన్ని అందించడంలో ముందుకు రావడంతోపాటు మీ సమయం, శక్తి సామర్థ్యాలకు తగిన విలువ దక్కుతోందో లేదో కూడా చూసుకోవాలి.తరువాయి

ఆర్జన సరే.. నిర్వహణా నేర్చుకోండి!
ఆర్థిక అంశాల్లో తడబడే అమ్మాయిలే ఎక్కువ. అందుకే డబ్బు నిర్వహణ తండ్రి, అన్న, భర్తల చేతుల్లో పెట్టేస్తుంటారు. తీరా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాళ్లు అందుబాటులో లేనపుడు ఏం చేయాలో తెలియదు. తనలా చాలామంది ఇలానే ప్రవర్తిస్తుండటం షగున్ బన్సాలీని ఆలోచనలో పడేసింది. ఆర్థిక నిర్వహణలో కొంత తోడ్పాటునందిస్తే ఈ స్థితిలో కొంత మార్పు తేవచ్చనుకుంది....తరువాయి

బాల్యంలో వ్యాయామం... భవిష్యత్తులో ఆరోగ్యం
మధు తన పిల్లలను కొంచెం వేగంగా కూడా పరుగెత్తనివ్వదు. ఎక్కడ పడిపోతారోనని ఆందోళనపడుతుంది. తల్లిగా పిల్లలకు గాయాలు తగులుతాయని భయపడటం సహజం. ఆ అనుమానమే భవిష్యత్తులో ఆ చిన్నారుల మెదడు చురుకుదనాన్ని తగ్గించేలా చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ పరిశోధన ధ్రువీకరించింది. బాల్యంలో పిల్లలు చేసే వ్యాయామం వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చదవండి...తరువాయి

చర్మానికి తేమ కావాలి...
చర్మం తేమగా ఉండటం చాలా అవసరం. మాయిశ్చరైజర్ల వల్ల చర్మానికి కాంతి వస్తుంది. పొడిబారడం, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు తలెత్తవు. ఎండ పొడ పడనివాళ్లు నూనె ఆధారిత మాయిశ్చరైజర్ను ఎంచుకోవాలి. ఇది మేకప్కు ప్రొటెక్టివ్ బేస్గానూ ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని అతిగా వాడితే పులిపిరులు...తరువాయి

బుడగలు మెచ్చే గొడుగులు!
చిరుజల్లుల్లో తడిసి ముద్దవుతుంటే కలిగే ఆనందం... ఆ తర్వాత వచ్చే జలుబు రొంపలతో ‘ఆవిరై’ పోతుంది. . అలా కాకుండా గొడుగు మనకు రక్షణ నిస్తుంది. నల్లగా, పొడవాటి కర్రతో ఉండే ఆ పాత రకం గొడుగులే కదా అంటారా... కాదు మార్కెట్లో ట్రాన్స్పరెంట్ అంబ్రెలాలూ అందుబాటులోకి వచ్చాయి. పారదర్శక కవర్పై పూలు, పక్షులు, సీతాకోక చిలుకలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయివి....తరువాయి

Yoga: రెండు కాళ్లు నుజ్జునుజ్జు.. యోగాతో కొత్త జీవితం
పట్టుదల ఉంటే... వైకల్యం ఉన్నా, పెళ్లయినా... పిల్లలు పుట్టినా, వయసు పైబడినా అనుకున్నది సాధించవచ్చు. అందుకు ఉదాహరణే ఈ ముగ్గురూ. యోగాతో సమస్యల్ని అధిగమించి, దాంతోనే ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, కీర్తి, సేవ... ఒకటేమిటి అన్నీ సాధిస్తున్నామంటున్న ముగ్గురు మగువల స్ఫూర్తి కథనాలివీ... యోగా దినోత్సవం సందర్భంగా ...తరువాయి

మృదువైన చర్మం కోసం...
పొడి, జిడ్డు ఎలాంటి చర్మానికయినా తేనె మంచిది. అర స్పూన్ తేనెను ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగితే తేటగా ఉంటుంది. గ్లైకాలిక్ లేదా ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు ఏ చర్మానికయినా మంచిదే. వాటిలో దూదిని ముంచి కళ్లు, పెదాలకు తాకకుండా రాయాలి. చర్మం మీద సూక్ష్మంగా వేల మృత కణాలుంటాయి. కనుక వారానికి ఒకటి రెండు సార్లు మృతకణాలు తొలగిపోయేలా చేయాలి. అప్పుడే రక్తప్రసరణ బాగుంటుంది.తరువాయి

అమ్మ కల నిజం చేయాలని...
చిన్నప్పటి నుంచీ అమ్మల కష్టం చూశారు. జీవితంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్న వారి ఆశలను నిజం చేయాలనుకున్నారు.అందుకు సెయిలింగ్ రూపంలో అవకాశం వచ్చింది. తమ సత్తా ప్రపంచానికి చూపడానికి ఇటలీ పయనమయ్యారు. ప్రపంచ దిగ్గజాలు జీవితంలో ఒక్కసారైనా సెయిలింగ్ చేయాలనుకునే రివాడెల్ గార్డా సరస్సులో పోటీ. విజయం సాధించి, కన్న...తరువాయి

మేం కూడా మ్యాచింగ్...మ్యాచింగ్
మ్యాచింగ్ జాబితాలో మేము సైతం అంటున్నాయి... ఫోన్, రిస్ట్వాచ్, హెడ్ ఫోన్స్ పౌచ్. ప్రస్తుతం మార్కెట్లోకి ఫోన్ బ్యాక్ కవర్ ఏ డిజైన్లో ఉంటే అదే వాచ్, పౌచ్కూ ఉండేలా వచ్చేస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్, చుక్కలు, చిన్నచిన్న పూలు లేదా.. ముదురు లేత వర్ణాల్లో మూడూ ఒకేలా ఉంటూ...తరువాయి

ముఖానికి క్యారెట్ క్రీం
క్యారెట్ను తినడమే కాకుండా, క్రీంలా తయారు చేసుకోవచ్చు. ఫ్రిజ్లో భద్రపరుచుకుని కొన్నాళ్లు వాడుకోవచ్చు. దీంతో ఈ వర్షాకాలంలో చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్ క్రీం తయారీ ఎలాగో చూద్దాం. క్యారెట్లోని విటమిన్ సి, బీటాకెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగానే కాదు, మెరిసేలా చేస్తాయి.తరువాయి

ఫాదర్స్డే స్పెషల్
మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి అమ్మాయిలందరికీ నాన్నే మొదటి హీరో. మరి మీకూ అంతేనా? నాన్నతో మన అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్ డే’ (21.6). మీ జీవితంలో, ఉన్నతిలో నాన్న పాత్ర, స్ఫూర్తి పొందిన అంశాలు, ఆయనతో మీ అనుబంధం... గురించి మాతో పంచుకోండి. అలానే మీ తండ్రీకూతుళ్ల అనుబంధానికి అద్దంతరువాయి

ఆ పిలుపు కోసమే.. ఉద్యోగం వదిలేశా!
అధికారం కోసం అన్నీ వదులుకునే వాళ్లని చూస్తుంటాం! కానీ అనాథలతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసం అధికారాన్నే వదులుకున్న వాళ్ల గురించి విన్నారా? గ్రూప్-1 ఉద్యోగాన్ని కాదనుకుని... జట్టు సేవాశ్రమాన్ని నిర్వహిస్తూ, అనాథలకు కొండంత అండగా నిలుస్తోన్న మానవతామూర్తి వెలిగండ్ల పద్మజ సేవాప్రస్థానం ఇది...తరువాయి

బిర్లా బాగా గుర్తుపడతారు!
ఇంజినీర్ కావాలన్నది ఆమె కల. అనుకోని పరిస్థితుల్లో ఫార్మాని ఎంచుకున్నారు. నాన్న మాటలతో పట్టుదల వచ్చి చదువుల్లో బంగారుపతకం సాధించారు. చిన్న వయసులోనే బిర్లా ఇన్స్టిట్యూట్స్ పరిశోధనల విభాగం అధిపతిగా ఎదిగారు. రొమ్ము క్యాన్సర్కు ఔషధాన్ని తయారు చేసినా... తాజాగా లాలాజలం ఆధారంగా క్యాన్సర్లను గుర్తించే ప్రక్రియను ఆవిష్కరించినా... ఏదో సాధించాలన్న తపనే కారణమంటారు. ఆమే యోగీశ్వరి పెరుమాళ్. స్ఫూర్తిదాయకమైన...తరువాయి

ఆరేసుకోలేక... కనిపెట్టింది!
ఫుట్బాల్ క్రీడాకారిణి ఆలియా ఓరాకి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడలేని ఇబ్బంది. ఎందుకంటే.. వానకి తడిచిన షూలని ఎండబెట్టుకోవడం పెద్ద ప్రహసనం. దానికి తోడు తేమ అధికంగా ఉండే ముంబయిలో... షూలు ఓ పట్టాన ఆరవు. ఒకవేళ ఆరినా పచ్చిగానే ఉండేవి. దాంతో విపరీతమైన దుర్వాసన. తర్వాత రోజు మ్యాచ్కి వాటితోనే ఆడాలి. దాంతో కొన్నిసార్లు చర్మవ్యాధులు కూడా వచ్చేవి. ఇది తన సమస్యే కాదు...తరువాయి

పేదలకు గూడు... ప్రకృతికి తోడు!
బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడాలన్నది చాలామంది కల. ఈమె మాత్రం విదేశీ ఉద్యోగాన్ని వదిలి మరీ స్వదేశానికి వచ్చేసింది. పర్యావరణ రక్షణతోపాటు పేదలకు ఇళ్లు లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకు వ్యవసాయ వ్యర్థాలను ఎంచుకుంది. ఆమే శృతి పాండే! శృతి పాండే యూఎస్లోని న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో పీజీ చేసి, మంచి ఉద్యోగాన్నీ సాధించింది....తరువాయి

హోమ్కేషన్ చేద్దాం...!
కరోనా వల్ల ఆఫీసులు, పిల్లల చదువులూ.. అన్నీ ఇంటి నుంచే. దీంతో ఇంటిల్లిపాదీ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉపశమనానికి ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే హోమ్కేషన్. అంటే ఇంట్లోనే వెకేషన్స్ను ఆస్వాదించడం అన్నమాట. అదెలాగో చూద్దాం. ఇంటివెనుక కాస్తంత స్థలం లేదా పెరటి తోట అదీ లేదంటే టెర్రస్... ఎక్కడైనా సరే దీనికి ఏర్పాటు చేసుకోవచ్చు. రంగు రంగుల దుపట్టాలు, పాత చీరలతో ఓ టెంట్ ...తరువాయి

దిండ్లనూ ఉతకొచ్చు!
దుప్పట్లు, గలేబుల్ని ఉతుకుతాం. కానీ... తలగడలకి వచ్చేసరికి... ఉతికితే పాడవుతాయనే భయంతో సర్దుకుపోతాం. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అదెలా చేయాలంటే... దూదితో చేసినవి కాకుండా మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. లేదంటే జిడ్డు, మురికి చేరి అనారోగ్యాలకు కారణం అవుతాయి....తరువాయి

ఈ పర్సులు పారదర్శకం...
ఇప్పుడు ఫ్యాషన్ అంతా పారదర్శకమే. ఈ పర్సులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఉల్లిపొరలా కనిపిస్తూ... ఈ బ్యాగులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయా దుస్తులకు తగ్గట్లుగా, సందర్భానికి సరిపడేలా వీటిని తయారు చేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లడానికి ఉపయోపడేలా, కాలేజీలకూ తీసుకెళ్లేలా బ్యాక్ ప్యాకులు కూడా వీటిలో ఉన్నాయి. హ్యాండ్ బ్యాగులు, పౌచ్లు, బెల్ట్ పౌచ్లు...తరువాయి

మార్పులొస్తున్నా మూగనోమేనా!
మహిళల నెలసరిపై కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఓ సర్వే తేల్చింది. సక్రమంగా రాకపోవడం, రక్తస్రావంలోనూ మార్పులు వంటి పలు అంశాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి. ‘ద సిక్స్త్ యాన్యువల్ మెనస్ట్రువల్ హైజీన్ సర్వే’ పేరుతో ఎవర్టీన్ సంస్థ నిర్వహించిన సర్వే 41 శాతం మంది మహిళల్లో నెలసరిలో పలు తేడాలను గుర్తించింది....తరువాయి

సేవకు సై అంటున్న బైకర్ భామలు!
ఆ పదిమందినీ బైక్ రైడింగ్ కలిపింది. అదొక్కటేనా అనుకున్నారు... అమర జవాన్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు ‘షీ ఫర్ సొసైటీ’గా ఏర్పడ్డారు. వీరి స్ఫూర్తి వందల మందిని ప్రేరేపించింది... ఇప్పుడా సొసైటీ వేలాది సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తోంది. దానికితోడు మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది.తరువాయి

మీ చిన్నారికి ఇవి అవసరం
రాధికకు రాత్రి అవుతుందంటేనే భయం. తన ఆరు నెలల ఆకృతి ఏడుపు మొదలుపెడుతుంది. పగలంతా చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఆ చిన్నారి చీకటి పడితే ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలీదు. చాలామంది తల్లుల సమస్య ఇది. పసిపిల్లలు తమ ఇబ్బందిని చెప్పలేక దాన్ని ఏడుపుతోనే ప్రదర్శిస్తారని అంటున్నారు వైద్య నిపుణులుతరువాయి

హద్దు మీరకుండా ఆపేస్తుంది!
ఇష్టమైన ఫొటో, అభిప్రాయం.. దేన్నైనా సోషల్ మీడియాలో పంచుకుంటుంటాం. వాటి మీద ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయం వెలిబుచ్చుతారు. ఇదంతా మామూలే! కానీ అది హద్దు మీరుతోంది. ఆ మీరడం ఒక్కోసారి డిప్రెషన్కే కాదు, చావు వరకూ తీసుకెళ్తోంది. సైబర్ బుల్లీయింగ్.. కాలేజ్ పిల్లల నుంచి సినీతారలు, రాజకీయ నాయకులు.తరువాయి

Zerodha: ఈవిడ జీతం వందకోట్లు!
‘ఐదంకెల జీతమట..’ అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకొనేవాళ్లం! అది పాతమాట. కోట్లలో జీతాలు అందుకోవడం ఇప్పుడు నయాట్రెండ్. కొమ్ములు తిరిగిన సీఈవోలతో పోటీ పడుతూ స్టార్టప్ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కింది జీరోధా డైరెక్టర్ సీమాపాటిల్...తరువాయి

ఆ సమస్య... కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది
‘తిండి, ఆరోగ్యంపై నువ్వస్సలు దృష్టిపెట్టట్లేదు’ అని వాళ్లమ్మ పోరు పెట్టేది. తనూ అందరి లాగే విని ఊరుకునేది. కానీ ఆ అమ్మాయికి పీసీఓడీ అని తేలింది. ఈ సమస్యను మందులతో కాకుండా సహజ ఆహారంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దామంది వాళ్లమ్మ. ఈసారి ఆమె మాట వింది. తన ఆరోగ్యంలో మార్పు వచ్చింది. దాన్నే ఇతరులకూ అందించాలనుకుని ఓ సంస్థను ప్రారంభించింది. చివరకు ఫోర్బ్స్ జాబితాకెక్కింది. అదీ ఏడాదిలోనే! ఇదంతా విభా హరీష్... గురించి!తరువాయి

క్రీడా కారుణ్యం
కొవిడ్ సెకండ్ వేవ్ ఎంతోమందిపై ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడ చూసినా.. తినడానికి తిండిలేక, ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు దొరక్క ఇబ్బంది పడేవారే! అదిచూసి మన క్రీడాకారిణుల మనసూ కదిలింది. ఆటలో ప్రత్యర్థిపైనే కాదు.. కరోనాపై పోరాటానికీ సై అంటున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. వారే.. సానియా మిర్జా, మిథాలీరాజ్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక. వారి సేవా ప్రయాణాన్ని మనమూ చూద్దామా!తరువాయి

గుడ్డిపిల్ల ఎలా బతుకుతుందన్నారు?
పందొమ్మిదేళ్ల వయసులో యాసిడ్ దాడిలో చూపును పొగొట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరుచు కుందామె. తనలాంటి మహిళలకు వసతి కల్పిస్తోంది. దివ్యాంగ చిన్నారులకు పంతులమ్మలా మారి పాఠాలు చెబుతోంది. ఆమే ఉత్తరాఖండ్కు చెందిన 31 ఏళ్ల కవితా బిస్త్.తరువాయి

అయిదొందల మందికి...బతుకు భరోసా!
కరోనా కల్లోలం... ఎన్నో కుటుంబాల ఉపాధిని లాగేసుకుంది. అప్పులు... పస్తులతోనే చాలా పేద, మధ్యతరగతి కుటుంబాల సావాసం. ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ని ఆలోచింపజేశాయి. దానికి పరిష్కారమే... ప్రాజెక్టు ప్రిషా! వందల మంది జీవితాల్లో వెలుగులు పూయిస్తోన్న ఆమె యశస్విని జొన్నలగడ్డ. దీని వెనక కథను ఆమె వసుంధరతో పంచుకున్నారు...తరువాయి

మౌనమెందుకు.... మేలుకో!
శిరీష (పేరుమార్చాం) భర్త పనిచేసే సంస్థ మూతపడటంతో అతని ఉద్యోగం పోయింది. ఆమె వర్క్ఫ్రమ్ హోం చేస్తోంది. అది అతనికి చిన్నతనంగా ఉంది. భార్య విధులు నిర్వర్తించే సమయంలోనే... పనులు చెప్పేవాడు. కాస్త ఆలస్యమైతే సూటిపోటి మాటలనేవాడు. ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడిలో మార్పురాలేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది.తరువాయి

Pavani Kotrike: ఈ అమ్మాయి ప్రేమకథలు చెబుతోంది!
ఆ అమ్మాయికి బొమ్మలు వేయడం అంటే ప్రాణం. అందులో పట్టు సాధించడం కోసం ఎంతో కష్టపడింది. ఇంటా బయటా తన బొమ్మలు చూసి అందరూ అబ్బురపడేవారు. ఆ రంగంలో నిలదొక్కుకుంటున్న సమయంలో హైదరాబాదు నగరానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ తన సృజ్ఞనాత్మకకు మెరుగుపెట్టుకుంది. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంది. బొమ్మలేకాదు సంగీతం, యాంకరింగ్పై తనకున్న ఇష్టాన్ని జోడించి రెండు రంగాల్లో దూసుకుపోతోంది. స్వయంకృషితో జీవితాన్ని వర్ణరంజితంగా మలుచుకుంటున్న యువతరంగం 27ఏళ్ల పావని కొట్రికెతో వసుంధర మాట్లాడింది...తరువాయి

Shreya Dhanwanthary: ఆ సినిమా 267సార్లు చూశా!
శ్రేయా ధన్వంతరి... అచ్చ తెలుగమ్మాయి. హిందీ సినిమాలు, వెబ్సిరీస్లు చూసే వాళ్లకు బాగా తెలిసినమ్మాయి. మిస్ ఇండియా పోటీలతో మొదలుపెట్టి అగ్రశ్రేణి మోడల్ ఎదిగింది. తెలుగులో ‘స్నేహగీతం’, హిందీలో ‘వై చీట్ ఇండియా’ సినిమాలతో వెండితెరపై మెరిసింది. ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 వంటి వెబ్ సిరీస్లలో నటనతో ఆకట్టుకుంటోంది. ‘మీటూ’తరువాయి

శాకాహారుల కోసమే ఈ సొన!
కోడి ముందా...గుడ్డు ముందా? అని అడిగితే చెప్పలేం కానీ... కోడి, గుడ్డూ రెండూ లేకుండా సొన మాత్రం ఉందంటోంది ముంబయికి చెందిన శ్రద్ధా భన్సాలీ. శాకాహారుల ప్రొటీన్ అవసరాలను తీర్చేందుకు మొక్కల ఆధారిత ద్రవరూప సొనను తయారు చేసి ప్రత్యామ్నాయ ఆహార రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తన విజయగాథ ఇదీ...తరువాయి

ఒకేసారి అన్ని పనులా?
మహిళలు ఇటు ఇంటిపనులు చక్కదిద్ది, భర్త, పిల్లల అవసరాలు తీర్చి...కుటుంబ బాధ్యతలు చూసుకుంటారు. అటు ఉద్యోగ విధులూ నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో పనులు సకాలంలో పూర్తవ్వాలన్న ఆలోచనతో మల్టీటాస్కింగ్ చేస్తుంటారు. అయితే దీనివల్ల ఒత్తిడి ఎక్కువ, ఉత్పాదకత తక్కువ అంటున్నారు నిపుణులు...తరువాయి

ఈ అమ్మాయిలు... వెన్నంటి మనసున్నోళ్లు...
యువ రక్తం కుదురుగా కూర్చోనివ్వదు..పైగా కరోనా వేళ పీజీ పరీక్షలు వాయిదా పడి సెలవులు వస్తే ఏం చేస్తారు..? ఇంకాస్త వెసులుబాటు దొరికిందని కాలాన్ని వెళ్లదీస్తారు. కానీ ఈ ఎంబీబీఎస్ పూర్తిచేసిన యువ వైద్యురాళ్లు మాత్రం అలా చేయలేదు. కరోనా పల్లెలు, పట్టణాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో తమ తోడ్పాటును సేవారూపంలో అందించాలని భావించారుతరువాయి

Lakshmi Devy: హాలీవుడ్ మెచ్చిన డాక్టరమ్మ!
‘ఒకడు అత్యాచారానికి తెగబెడితే.. అవమాన పడాల్సింది స్త్రీకాదు. ఆ మగాడే!’ ఇలాంటి మాటలు మనకు మింగుడుపడకపోవచ్చు.. అంగీకరించడానికి మనస్కరించకపోవచ్చు. కానీ ఇదే నేపథ్యంతో ‘వెన్ ది మ్యూజిక్ ఛేంజెస్’ అనే చిత్రాన్ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా సినీవిమర్శకుల ప్రశంసలు అందుకుంది లక్ష్మీదేవి.తరువాయి

తానే గీసుకుంది గెలుపు చిత్రం
డిగ్రీ అయిందో లేదో అమెరికా సంబంధం వచ్చింది. పందిరేసినంత సేపు నిలవలేదా పెళ్లి. నిష్కారణ కోపం. హింస, కొట్టడం నుంచి అంతు చూసే స్థాయికెళ్లింది. ఆమె సాధించాల్సింది మిగిలే ఉంది కనుకనే మూడుసార్లు చావునుంచి తప్పించుకుంది. ఉన్నతోద్యోగాలు చేసింది. చిత్రకారిణిగానూ రాణిస్తూ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన హైదరాబాద్ అమ్మాయి హిమబిందు కథ ఇది...తరువాయి

పిల్లలు..క్షేమమిలా
కొత్తగా తల్లులైన వారికి ప్రతిదీ కంగారే! మంచం మీద పడుకోబెట్టి అలా పక్కకు వెళ్లారో లేదో దొర్లుతూ కింద పడతాడేమోననే భయం. పాకుతుంటే నేల రాసుకుంటుందేమో అనుమానం. నేర్చుకునే క్రమంలో ఇవన్నీ సహజమే అయినా.. వారికి తగిలే చిన్న దెబ్బ ఆమె ప్రాణం విలవిలలాడేలా చేస్తుంది. వారూ ఇలాంటివే అనుభవించారో ఏమో.. తయారీదారులు వీటికి తగ్గ యాక్సెసరీలను తయారు చేశారు.తరువాయి

ఏఐతో తక్షణ రక్షణ!
మన ధ్యాసలో మనముంటాం. ఆలోచనల్లో మునిగిపోతాం. లేదంటే ఫోనులో బిజీగా ఉంటాం. కానీ కొన్ని కళ్లు మనల్నే పరిశీలిస్తున్నాయని, సమయం వచ్చినప్పుడు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయని గమనించుకోం. బస్టాండుల్లో... రైల్వేస్టేషన్లలో, ఇతర జనావాసాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో పరికించుకోవడం చాలా అవసరం.తరువాయి

మనసున్న నర్సమ్మలు!
చేసే పనిని ప్రేమించే మనసుండాలే కానీ... ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఇట్టే జయించొచ్చు! దీన్ని నిజమని నిరూపించారు ఇద్దరు మనసున్న నర్సమ్మలు. ఇరవై ఏళ్లుగా సేవామార్గంలో సాగుతూ.. ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ అవార్డుని అందుకుంటున్న మహమ్మద్ సుక్రా, అరుణకుమారిలు వారి అనుభవాలను వసుంధరతో పంచుకున్నారు...తరువాయి

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!
‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు
అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్.. పేరు చెప్పగానే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఛార్లెస్ డార్విన్, విన్స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్, కవితా రమణన్, గాయత్రీ చక్రవర్తి స్పివక్. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.తరువాయి

Mother's Day: నడిపించారు... గెలిపించారు!
ఆడపిల్లవు... నీకెందుకు చదువు అనలేదు సమాజాన్ని చదివే సహనాన్ని అందించారు!అమ్మాయివి.. నీ సరిహద్దులు ఇంతే అని గిరిగీయలేదు ఆకాశమంత ఎత్తు ఎగిరే స్వేచ్ఛనిచ్చారు! స్త్రీలను బంధించే సంప్రదాయ సంకెళ్లను ఛేదించి... ఎంచుకున్న రంగంలో బిడ్డలను ‘శక్తు’లుగా తీర్చిదిద్దారు. మాతృదినోత్సవం సందర్భంగా... ఆ అమ్మల గురించి పిల్లలు ఏం చెబుతున్నారో చదవండి...తరువాయి

ఆ ప్రశ్నకు సమాధానం... ఇరవయ్యేళ్ల సేవ!
ఒక చేత్తో చక్రాలకుర్చీని తోసుకొంటూ... మరో చేత్తో గుక్క పెడుతున్న పిల్లని ఓదారుస్తోందామె. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎర్రలైటు పడినప్పుడల్లా... ఏ మనసున్న మారాజయినా సాయం చేయకపోతాడా అని ఆశగా చూస్తోంది. ఆ దృశ్యాన్ని మనసులో నింపుకొన్న అడుసుమిల్లి నిర్మల అభాగ్యులకు అండగా ఉండాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. ఆమెని కదిలించిన ఆ దృశ్యమే 20 ఏళ్లుగా వేల మందికి సేవ చేయిస్తోంది...తరువాయి

వయసు 29... వ్యాపారం ఏడువేల కోట్లు!
ఎనిమిది దేశాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం... ఐదొందలమంది ఉద్యోగులు... ఏడువేలకోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు... ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! చిన్న వయసులోనే ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్ క్లబ్లో అడుగుపెట్టిన అంకితిబోస్ ఈ అద్భుత విజయాలని సృష్టిస్తోంది...తరువాయి

తీరాలకు వనహారాలను అల్లుతూ..!
పీహెచ్డీ చేసినా తగిన ఉద్యోగావకాశాలు రాలేదామెకు...అయినా నిరాశపడలేదు. తన నైపుణ్యాలనే ఊతంగా కొత్త ఆవిష్కరణలు చేశారు దిట్టకవి సాయిరమ్య సుజన. కాలుష్యాన్నీ, ఉప్పుగాలులనీ తట్టుకుని.. 90 రోజులు నీళ్లు లేకపోయినా బతికేలా ఆమె తయారుచేసిన మొక్కలు ప్రపంచ బ్యాంకు ప్రశంసలనే కాదు మరిన్ని అవకాశాలనూ అందించాయి. అవేంటో తెలుసుకుందాం రండి...తరువాయి

దూసుకుపోతున్న బుల్లెట్లు!
అతి ఎత్తైన ఘాట్ రోడ్లు... అటూ ఇటూ వేల అడుగుల లోయలు... అత్యంత ప్రమాదకరమైన మలుపులు... అలాంటి చోట్ల బైక్ ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ ఇద్దరమ్మాయిలు... ఒంటరిగానే ఈ యాత్రలు చేస్తున్నారు. అంతేనా! ఆ ప్రయాణాల్ని, అక్కడి వింతలు, విశేషాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు...తరువాయి

అయితే ఏంటి?
ఏదైనా అరుదైన వ్యాధి రాగానే చాలామంది కుంగుబాటుకు గురవుతారు. కొందరు మాత్రం ప్రతికూల ఆలోచనల నుంచి స్వయంకృషితో బయటపడుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని నచ్చిన రంగాల్లో అడుగుపెడుతున్నారు. ఛాలెంజ్లను ఎదుర్కొంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. ‘అవును. మాకీ సమస్య ఉంది! అయితే ఏంటి’ అంటూ ధైర్యంగా నిలబడుతున్నారు. అలాంటి ముగ్గురు ధీరల స్ఫూర్తి కథనం ఇది.తరువాయి

హక్కుల చైతన్యమిస్తూ..
కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండిపోతామా..? బాధ్యత ఉండాలిగా.. న్యాయంగా దక్కాల్సింది చేజారిపోతుంటే ఊరుకుంటామా..? హక్కులున్నాయిగా! కానీ అవందరికీ తెలియవుగా అంటోంది. అందుకే వాటిని పరిచయం చేస్తోందా యువతి. తను చదివే విద్యను ఊరకే పోనీయకుండా ఊరూరా తిరిగి పాఠాలు చెబుతోంది....తరువాయి

వైద్యం, సేవ, రచన @ ప్రతిభ!
పసిపాపలపై అఘాయిత్యాల వార్తలు విన్నప్పుడల్లా... ఓ తల్లిగా ఆవిడ తల్లడిల్లిపోతారు. ఈ కాలంలోనూ... నెలసరి అపోహలతో అనారోగ్యాల బారిన పడుతోన్న ఆడపిల్లలను చూసి ఆందోళన చెందుతారు. చదువులకు దూరం అవుతున్న అమ్మాయిలను చూసి ఆవేదన పడతారు. ఈ సమస్యల పరిష్కారంలో డాక్టర్గా, మహిళగా, అమ్మగా తనవంతు బాధ్యత నిర్వర్తించాలనుకున్నారు. ఆవిడే హైదరాబాద్కి చెందిన డాక్టర్ ప్రతిభాలక్ష్మి.తరువాయి

ఈ సివంగిని చూస్తే హడల్
అడవి పక్కనే పదిహేను గడపలుండే ఓ చిన్న గ్రామం జమునా టుడూ వాళ్లది. ఓ అర్థరాత్రి... పదిహేను మంది దుండగులు వాళ్ల ఇంటిపై దాడి చేశారు. నిద్రపోతున్న జమున భర్తని కట్టేసి ఆమెకి తుపాకీ గురిపెట్టారు... ‘అడవి గురించి ఆలోచిస్తే... ప్రాణాలు తీసేస్తాం’ అంటూ జమునని తీవ్రంగా హెచ్చరించారు. ఇది 14 ఏళ్లకిందటి మాట.తరువాయి

మీరు చూపిన మార్గానికి వందనాలు చందనా!
పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి... ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తపన... సామాజికాభివృద్ధిలో తానూ ఓ భాగం కావాలనే ఆలోచన... ఆమెను ఐఏఎస్ సాధించే దిశగా అడుగులు వేయించాయి. ఆ లక్ష్యంతోనే కోటిరూపాయల జీతాన్నీ, విలాసవంతమైన జీవితాన్నీ, విదేశాల్లో ఉద్యోగాన్నీ తృణప్రాయంగా వదులుకుని వచ్చేశారామె. ఆమే దాసరి హరిచందన. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కలెక్టర్గా పనిచేస్తోన్న ఆమెకు సామాజిక మార్పునకు కృషిచేస్తున్నందుకు యూకే ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు-2021 ప్రకటించింది...తరువాయి