Published : 30/05/2021 00:28 IST

మనసు మాట చేరవేస్తుంది

లాక్‌డౌన్‌, వేర్వేరు ప్రదేశాల్లో ఉద్యోగం, భౌతిక దూరం.. కారణమేదైనా కొన్ని జంటలు వేర్వేరుగా ఉండే పరిస్థితులను కల్పించాయి. ఫోను, వీడియో కాల్స్‌ కొంత దగ్గర చేసినా.. వాళ్లు పక్కనలేని లోటు తప్పక ఉంటుంది. ఇలాంటివారి కోసమే సీఎంయూ, స్నాప్‌ రిసెర్చర్స్‌ ‘హార్ట్‌ కమ్యూనికేషన్‌’ పేరిట స్మార్ట్‌వాచ్‌ యాప్‌ను తయారు చేశారు. ఎదుటివారి గుండె చప్పుడు ఆధారంగా వారి భావోద్వేగాలను తెలియజేయడం దీని ప్రత్యేకత.
ఇదెలా సాధ్యమంటే? ఒకరి గుండె చప్పుడు ఆధారంగా యాప్‌ ఒక ఆటర్‌ ఎమోజీని సూచిస్తుంది. దాన్ని అవతలి వారికి పంపే వీలుంటుంది. దాని ఆధారంగా అవతలి వ్యక్తి రిప్లై పంపుతారు. ఉదాహరణకు- ఒక వ్యక్తి కోపంగానో, బాధగానో ఉన్నపుడు ఉన్న గుండె కొట్టుకునే వేగం ఆధారంగా యాప్‌ ఒక ఎమోజీని సూచిస్తుంది. దాన్ని మీరు మీ భాగస్వామికి పంపొచ్చు. దాని ఆధారంగా ఆ వ్యక్తి రిప్లైలో భాగంగా నాకూ బాధ అనిపిస్తుందనో, ఓదార్చుతున్నట్లో ఉన్న ఎమోజీని పంపుతారన్న మాట. దీన్నీ యాపే సూచిస్తుంది. కావాలనుకుంటే కొద్దిగా మార్పు చేసుకోవచ్చు. కానీ వచ్చిన ఎమోజీకి అనుగుణమైన వాటినే సూచిస్తుంది. అంటే.. మాట లేకుండా మనసు భాషను అర్థం చేసుకోవడమన్న మాట. అయితే ఇద్దరి స్మార్ట్‌ వాచ్‌ల్లోనూ ఈ యాప్‌ ఉండాలి. దీనిని కొన్ని జంటల మీద ప్రయోగించగా వారు సానుకూలంగా స్పందించారట. మామూలు సమయంలో కంటే దీని ద్వారా భావోద్వేగాలను బాగా పంచుకోగలిగాం అన్నారట. అన్నట్టూ.. ఇది ప్రయోగ దశలో ఉంది.అందుబాటులోకి వచ్చాక నోరు విప్పకుండానే మీ భావాలను ప్రేమించిన వారికి చేరవేయవచ్చన్న మాట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి