ఆందోళన తగ్గించే ఆహారం!

సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచే చాలామందిలో తెలియకుండానే ఒత్తిడి, ఆందోళనలను పెంచేసింది. ఇప్పుడిక మూడో వేవ్‌ అంటున్నారు.

Published : 14 Jun 2021 17:43 IST

సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచే చాలామందిలో తెలియకుండానే ఒత్తిడి, ఆందోళనలను పెంచేసింది. ఇప్పుడిక మూడో వేవ్‌ అంటున్నారు. అవి ఇంకాస్త పెరిగే ప్రమాదముంది. కాబట్టి, కొత్త సమస్యలు తెచ్చుకోకూడదంటే వీటికి చెక్‌ పెట్టేయాల్సిందే. ఇది ఆహారంతో సాధ్యమంటున్నారు నిపుణులు.
* గుమ్మడి గింజల్లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంతో పాటు రక్తపోటునూ తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు, అరటిని తరచుగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండొచ్చు.
* ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్‌, విటమిన్‌ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.
* డార్క్‌ చాక్లెట్‌లో థియోబ్రొమైన్‌ ఉంటుంది. ఇదీ యాంగ్జైటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పులిసిన పదార్థాలతో చేసే ఇడ్లీ, దోశ వంటివీ దీనికి చక్కని మందు.
* సిట్రస్‌ ఫలాలు సానుకూల ఆలోచనలనూ పెంచుతాయట. కామోమైల్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఆత్రుతŸను తగ్గించే గుణాలుంటాయి. వీటినీ తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్