అలసిన కళ్లకు.. గులాబీ నీళ్లు!

ఎక్కువసేపు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్‌లు చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి. ఇది ఎక్కువ కాలం సాగితే కంటి సమస్యలు తప్పవు. దీనికి పరిష్కార మార్గాలేంటో చూద్దామా...

Published : 18 Jun 2021 01:12 IST

ఎక్కువసేపు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్‌లు చూడటం వల్ల కళ్లు అలసిపోతాయి. ఇది ఎక్కువ కాలం సాగితే కంటి సమస్యలు తప్పవు. దీనికి పరిష్కార మార్గాలేంటో చూద్దామా...
చల్లని నీళ్లు... కళ్లను చల్లటి నీటితో రోజులో రెండు మూడు సార్లు కడుక్కోవాలి. ఇలా చేస్తే కళ్ల మంట, నొప్పి లాంటివి తగ్గి తాజాగా మారతాయి.
రోజ్‌ వాటర్‌.. ఓ గిన్నెలో కాసిన్ని నీళ్లు, అందులో చెంచా గులాబీ నీళ్లు కలపాలి. ఈ నీటిలో దూది ఉండలను ముంచి అయిదారు నిమిషాలు కళ్లపై పెట్టుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తే కళ్లు బరువెక్కడం, నొప్పి, మంట లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
పుదీనా.. గిన్నెలో నీళ్లు పోసి, గుప్పెడు పుదీనా ఆకులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే ఈ నీటిలో దూది ఉండలను ముంచి కళ్లపై కాసేపు పెట్టుకోవాలి. కళ్ల అలసట మాయమవుతుంది.
అరచేతులూ... రెండు చేతులను గట్టిగా రుద్దుకుని కళ్లమీద కాసేపు పెట్టుకోండి. వాటి వెచ్చదనం కంటికి సాంత్వన కలిగిస్తుంది.  
ఇవి కాకుండా.. అదేపనిగా కంప్యూటర్‌, ఫోన్‌ చూడకుండా మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

* కళ్లను తరచూ కడుక్కోవాలి. అలాగే తగినన్ని నీళ్లు తాగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్