Mummy mystery: 128 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పుడు అంత్యక్రియలు!
అమెరికాలోని (America) చిన్న నగరం రీడింగ్లో ‘స్టోన్మ్యాన్ విల్లీ’గా పిలిచే మమ్మీ (Mummy) ఉంది. ఈ శనివారం దానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Image: WorldBufferZone
ఇంటర్నెట్ డెస్క్: సుమారు 128 ఏళ్ల క్రితం అమెరికాలోని పెన్సిల్వేనియా జైలులో ఓ దొంగ కిడ్నీ వైఫల్యంతో చనిపోయాడు. ఇప్పుడు అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విచిత్రంగా ఉంది కదూ! అయితే, అనుకోకుండా ‘మమ్మీ’గా (Mummy) మార్చిన మృతదేహం కథ మీరు తెలుసుకోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని (America) చిన్న నగరం రీడింగ్లో ‘స్టోన్మ్యాన్ విల్లీ’గా పిలిచే మమ్మీ ఉంది. దాన్ని ఓమన్స్ ఫ్యూనరల్ హోమ్లో భద్రపరిచారు. మమ్మీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది కదా..! అందుకే అక్కడికి పర్యాటకులు, స్థానికులు అత్యధిక సంఖ్యలో తరలివెళ్తుంటారు.
లక్ష్యం లేకుండా సంచరిస్తున్న భారీ గ్రహశకలం.. భూమికి సమీపంగా వస్తోందట!
మమ్మీ రూపంలో ఉన్న వ్యక్తి 1895 నవంబర్ 19న చనిపోయాడు. దొంగతనం కేసులో జైల్లోకి వచ్చిన అతడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు జైలు అధికారులు ప్రయత్నించగా వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. విచారణలో అతడు నకిలీ పేరు చెప్పినట్లు తెలిసి విస్తుబోయారు. పోలీసులు మృతుడి కుటుంబీకుల కోసం వెతుకుతున్న సమయంలోనే మృతదేహం ఫ్యూనరల్ హోమ్కు చేరింది. ఎక్కువ రోజులు అక్కడే ఉంటే మృతదేహం కుళ్లిపోతుందనే ఉద్దేశంతో తమకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో దాన్ని అప్పటికప్పుడు మమ్మీగా మార్చేశారు. ఎంత వెతికినా మృతుడి కుటుంబీకుల వివరాలు తెలియకపోవడంతో దాన్ని మమ్మీగానే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఫ్యూనరల్ హోమ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తాము చేసిన ప్రయోగం ఎంత మేరకు విజయవంతం అయిందో తెలుసుకోవడానికి ఆ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం అందరికీ కన్పిస్తున్న మమ్మీ ఓ సూట్, టై ధరించి ఉంది. దాని వెంట్రుకలు, దంతాలు చెక్కు చెదర్లేదు. శరీరం మాత్రం ఎండబెట్టిన జంతు చర్మంలా తయారైంది. మమ్మీ ప్రయోగం జరిగి వందేళ్లు గడిచిపోయిన తరువాత స్టోన్మ్యాన్ విల్లీ అసలు ఎవరు అనే విషయాన్ని ఫ్యూనరల్ హోమ్ కనుగొంది. కొన్ని పురాతన దస్త్రాలు, అత్యాధునిక సాంకేతికత సాయంతో అతడి వివరాలను రాబట్టింది. మృతుడికి ఐరిష్ మూలాలున్నట్లు సమాచారం. దాంతో ఈ శనివారం (అక్టోబరు 7) రీడింగ్ వీధుల గుండా మమ్మీ అంతిమయాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత్యక్రియలు పూర్తయిన తరువాత కట్టే సమాధిపై మమ్మీగా మారిన మృతుడి అసలు వివరాలను ముద్రిస్తామని ఫ్యూనరల్ హోమ్ చెబుతున్నట్లు కొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
Israel-Hamas: ఒకవైపు బందీల విడుదల కొనసాగుతుండగా.. తమ చెరలో ఉన్న ఓ చిన్నారి మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. -
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయ వ్యక్తిపై తాజాగా అమెరికా(USA) అభియోగాలు మోపింది. -
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
Henry Kissinger: ప్రముఖ దౌత్య వేత్త అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..