WHO: 1.70 కోట్ల మంది ‘ఈయూ’వాసుల్లో లాంగ్ కొవిడ్ లక్షణాలు!
కరోనా(Corona) వ్యాప్తి మొదటి రెండేళ్లలో ఐరోపా సమాఖ్య(EU) దేశాల్లో దాదాపు 1.70 కోట్ల మంది దీర్ఘకాలిక కొవిడ్(Long Covid) లక్షణాల (అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.........
ఇంటర్నెట్ డెస్క్: కరోనా(Corona) వ్యాప్తి మొదటి రెండేళ్లలో ఐరోపా సమాఖ్య(EU) దేశాల్లో దాదాపు 1.70 కోట్ల మంది దీర్ఘకాలిక కొవిడ్(Long Covid) లక్షణాల (అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర)తో బాధపడినట్లు తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఈ సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. డబ్ల్యూహెచ్వో(WHO) కోసం ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్, ఎవల్యూషన్(IHME)’ అనే సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. 2020, 2021ల్లో ఈయూ దేశాల్లో కరోనా సోకిన కొందరిలో కనీసం మూడు నెలలపాటు లాంగ్ కొవిడ్ లక్షణాలు కొనసాగాయని నివేదికలో పేర్కొంది. యూరప్, మధ్య ఆసియా ప్రాంతాల్లో లక్షలాది మంది దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలతో బాధపడినట్లు డబ్ల్యూహెచ్వో యూరప్ రీజినల్ డైరెక్టర్ హెన్రీ క్లూగే సైతం ధ్రువీకరించారు.
లాంగ్ కొవిడ్ లక్షణాల బారిన పడే అవకాశం పురుషుల కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉందని నివేదిక సూచిస్తోంది. ఒక్కోసారి ఆసుపత్రిలో చేరేంతగా పరిస్థితులు దిగజారే అవకాశం ఉందని పేర్కొంది. ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘కొవిడ్తో ఎంత మంది ప్రభావితమయ్యారు? ఎంతకాలం ఆరోగ్య వ్యవస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? తదితర అంశాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. అయితే, ఈ గణాంకాలు కేవలం అంచనాలేనని.. లాంగ్ కొవిడ్పై రూపొందించిన ఇతర అధ్యయనాల వివరాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.