Guinness World Record: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసి... రికార్డు కొట్టేసింది!
చిన్నతనం నుంచే పైలట్గా రాణించాలన్నది జరా రూథర్ ఫర్డ్ కల. ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్లే. దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది.
కోర్త్రిజిక్ (బెల్జియం): దేశంలో ఓ మూల నుంచి మరో మూలకు వెళితే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం మనలో చాలా మందికి కష్టం.. అలాంటిది భిన్న వాతావరణ పరిస్థితులను దాటిందా అమ్మాయి! బస్సులోనో, రైళ్లోనో ఒంటరిగా ప్రయాణించాలంటే మనలో చాలా మంది భయపడుతుంటారు.. కానీ, విమానంలో వేల కిలోమీటర్లు ప్రయాణించిందా అమ్మాయి! నాలుగు రోజులు తల్లిదండ్రులను వదిలి వెళ్లాలంటే బెంగ పెట్టుకుంటారు కొందరు.. కానీ ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది ఆ అమ్మాయి! అదీ ఒంటరిగా.. ఓ బుల్లి విమానంలో!! అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆమెకు దాసోహమయ్యింది. ఆమే బెల్జియంకు చెందిన జరా రూథర్ ఫర్డ్. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా తాజాగా గిన్నీస్ రికార్డు నెలకొల్పింది.
చిన్నతనం నుంచే పైలట్గా రాణించాలన్నది జరా రూథర్ ఫర్డ్ కల. ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్లే. దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరింది. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలని నిర్ణయించుకుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది. బుల్లి విమానంలో ప్రపంచ యాత్రకు బయల్దేరింది. వాస్తవానికి మూడు నెలల్లోనే ఈ ప్రయాణం పూర్తి కావాలి. కానీ ఐదు నెలల సమయం పట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల రెండు నెలల ఆలస్యంగా 155 రోజుల తర్వాత స్వదేశంలోకి అడుగు పెట్టింది. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బెల్జియం ఎయిర్ఫోర్స్కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చాయి. స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే తల్లిదండ్రులకు ముద్దాడి తన సంతోషం వ్యక్తంచేసింది.
ఈ ప్రయాణంలో ఐదు ఖండాల్లోని 41 దేశాలను సందర్శించింది జరా. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితులను చూశానని చెప్పుకొచ్చింది. మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతల నుంచి 32 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతల వరకు తన ప్రయాణం కొనసాగిందని చెప్పారు. ఒక్కోసారి భయం వేసేదని, అయినా ఈ సాహసం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులు, బాలికలు కూడా తనలా ఏవియేషన్ రంగంవైపు అడుగులు వేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈమె కంటే ముందు అమెరికాకు చెందిన 30 ఏళ్ల షయెస్తా వాయిజ్ 2017లో ప్రపంచాన్ని చుట్టొచ్చి రికార్డు నెలకొల్పారు. ఇప్పుడా రికార్డును జరా రూథర్ఫర్డ్ అధిగమించింది. 18 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టొచ్చిన వ్యక్తిగా ట్రావిస్ లుడ్లో అనే యువకుడి పేరిట ఆ రికార్డు ఇంకా సజీవంగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
లైంగిక నేరారోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్(72)కు ఓ కేసులో ఊరట లభించింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా