
Pakistan: పాకిస్థాన్లో ఇద్దరు సిక్కుల హత్య.. మైనారిటీలే లక్ష్యంగా దాడులన్న భారత్
ఉగ్రవాద చర్యగా పేర్కొన్న పాక్ ప్రభుత్వం
పెషావర్: పాకిస్థాన్లో మైనారిటీలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు రాజధాని పెషావర్కు సమీపంలో ఇద్దరు సిక్కు పౌరులను దుండగులు కాల్చి చంపారు. సర్బాంద్ పట్టణంలోని బాబా తాల్ బజార్లో దుకాణం నిర్వహిస్తోన్న సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్ (38) లపై దుండగులు కాల్పులు జరపడంతో వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు బైకుపై పారిపోయారు. అయితే, ఈ దాడులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ ఉగ్రచర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ అకిక్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు.
ఖండించిన పాక్ ప్రధాని..
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన ఈ దాడిని పాక్ ప్రధాని హెషబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతోపాటు వారికి శిక్షపడేలా చూడాలని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమ్మూద్ ఖాన్ను ఆదేశించారు. ముస్లిమేతర పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న ఆయన ఉగ్రచర్యలను సహించేది లేదన్నారు. మరోవైపు మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వం విఫలమైందని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే నివేదిక అందించాలని ప్రావిన్సు చీఫ్ సెక్రటరీతోపాటు ఐజీపీలను ఆదేశించారు. ఇక సిక్కలపై దాడి ఘటనపై స్పందించిన పాకిస్థాన్ విదేశీ వ్వవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో.. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.
భారత్ నిరసన..
పాకిస్థాన్లో మైనారిటీలపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఘోరమైన, దుర్భరమైన దాడిగా పేర్కొన్న భారత్.. వరుసగా జరుగుతోన్న దారుణాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా మైనారిటీ వర్గాలను లక్ష్యంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే, పెషావర్లో దాదాపు 15వేల సిక్కులు నివాసం ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా వ్యాపారం, ఫార్మసీలను నిర్వహించేవారే. అయితే, గతంలోనూ ఇక్కడ మైనార్టీలపై దాడులు జరిగాయి. యునాని వైద్యుడిగా ఉన్న ఓ సిక్కు మతస్థుడిని గతేడాది సెప్టెంబరులో దుండగులు కాల్చిచంపారు. 2018లోనూ చరణ్జిత్ సింగ్ అనే వ్యక్తి పెషావర్లో హత్యకు గురయ్యాడు. ఇక 2020లో వార్తాఛానల్ యాంకర్ రవిందర్ సింగ్ కూడా దుండగుల దాడిలో చనిపోయాడు. 2016లోనూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న సోరెన్ సింగ్ను కాల్చిచంపారు. 2017 గణాంకాల ప్రకారం, పాకిస్థాన్లో మైనారిటీలుగా ఉన్న వారిలో హిందువులే ఎక్కువ. రెండో వరుసలో క్రిస్టియన్లు ఉండగా, సిక్కులు, పార్సీలు ఇతర మైనారిటీలు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Talasani: మోదీజీ.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలేవీ?: తలసాని
-
World News
Sri Lanka: శ్రీలంకలో పాఠశాలల మూసివేత..మరోమారు భారత్ ఇంధన సాయం
-
General News
Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్చల్
-
General News
PM Modi: గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు
-
India News
హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 16 మంది దుర్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్స్టోక్స్ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య