Israel: నెతన్యాహూ విజయంతో ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు
ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజిమన్ నెతన్యాహూ ఎన్నికైన వేళ గాజా పట్టీ నుంచి రాకెట్ దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్ దళాలు గట్టిగా జవాబిచ్చాయి.
ఇంటర్నెట్డెస్క్: ప్రధానిగా బెంజిమన్ నెతన్యాహూ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమైన వెంటనే ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు మొదలయ్యాయి. నిన్న ఈ దాడులు జరిగినట్లు సమాచారం. గాజాపట్టీ నుంచి నాలుగు రాకెట్లను ఇజ్రాయెల్పైకి ప్రయోగించారు. వీటిల్లో ఒక్కదానిని ఐరన్డోమ్ వ్యవస్థ అడ్డుకొంది. ఈ దాడులకు ఇస్లామిక్ జిహాద్ సంస్థ బాధ్యతను తీసుకొంది. అల్-బద్ర్ గ్రూప్ కమాండర్ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పేర్కొంది.
ఈ దాడికి ఇజ్రాయెల్ కూడా గట్టిగానే జవాబిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు గాజాపట్టీలోని ఓ రాకెట్ ఫ్యాక్టరీపై దాడి చేశాయి. ఇజ్రాయెల్కు చెందిన యుద్ధ విమానాలు హమాస్ గ్రూప్ నిర్వహిస్తున్న అండర్గ్రౌండ్ రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. మధ్య గాజాలోని అల్ మఘాజీ శరణార్థి శిబిరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఏప్రిల్ నుంచి ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన మూడో ఆయుధ ఫ్యాక్టరీ ఇది. ఈ దాడిలో ఎంత ప్రాణనష్టం జరిగిందో సమాచారం తెలియలేదు.
ఇజ్రాయెల్లో 2019 నుంచి కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు ఎట్టకేలకు గురువారం తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికడ్ పార్టీ నేతృత్వంలోని మితవాద కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. గురువారం 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆ కూటమి 64 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇజ్రాయెల్ పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 120. ఈ నేపథ్యంలో నెతన్యాహు మళ్లీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనప్రాయమే. మరోవైపు- ప్రస్తుత ప్రధాని యయిర్ లపిడ్ ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.