Kabul: క్లాస్రూమ్లో ఆత్మాహుతి దాడి ఘటనలో 46మంది బాలికలు మృతి
రాజకీయ అస్థిరతతో అల్లాడుతున్న అఫ్గానిస్థాన్లో వరుస బాంబు పేలుళ్లతో అక్కడ రక్తపాతం కొనసాగుతోంది. గత శుక్రవారం (సెప్టెంబర్ 30న) కాబూల్ నగరంలోని ఓ విద్యా కేంద్రంలోని తరగతి గదిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో......
కాబుల్: రాజకీయ అస్థిరతతో అల్లాడుతున్న అఫ్గానిస్థాన్లో వరుస బాంబు పేలుళ్లతో అక్కడ రక్తపాతం కొనసాగుతోంది. గత శుక్రవారం (సెప్టెంబర్ 30న) కాబూల్ నగరంలోని ఓ విద్యా కేంద్రంలోని తరగతి గదిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ ఘటనలో తొలుత 19మందికి పైగా మృతిచెందినట్టు అక్కడి అధికారులు పేర్కొనగా.. తాజాగా ఆ సంఖ్య 53కి చేరినట్టు అఫ్గాన్లోని ఐరాస సహాయ మిషన్ (UNAMA) వెల్లడించింది. మృతుల్లో 46మంది బాలికలు, యువతులే ఉన్నట్టు తెలిపింది. తమ మానవ హక్కుల బృందం ఈ పేలుళ్ల ఘటనను డాక్యుమెంట్ చేస్తూనే ఉందని.. వాస్తవాలను ధ్రువీకరించి విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
అక్టోబర్ 30న రాజధాని నగరానికి సమీపంలోని మైనార్టీ హజారా కమ్యూనిటీ ప్రజలు అధికంగా ఉండే దశ్త్-ఇ-బార్చి ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ‘విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు’ అని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా చిన్నారులు మృతిచెందినట్టు కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేసిన ఐరాస సహాయ మిషన్ తాజా వివరాలను ట్విటర్లో వెల్లడించింది. మరోవైపు, అఫ్గాన్లో అమెరికా తన బలగాల్ని ఉపసంహరించడంతో తాలిబన్లు పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హజారా కమ్యూనిటీపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఐసిస్ హస్తం కూడా ఉంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థినులు, యువతులు తిరిగి విద్యా సంస్థల్లో చేరకుండా అడ్డుపడుతూ మానవహననానికి పాల్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ