Nord Stream: నార్డ్ స్ట్రీమ్లో నాలుగో లీకేజీ.. యూరప్ దేశాల్లో కలవరం..!
బాల్టిక్ సముద్ర మార్గంలో రష్యా నుంచి జర్మనీకి సహజవాయువును తరలించే నార్డ్ స్ట్రీమ్ పైపులైన్లలో వరుస లీకేజీలు కలవరపెడుతున్నాయి.
లండన్: బాల్టిక్ సముద్ర మార్గంలో రష్యా నుంచి జర్మనీకి సహజవాయువును తరలించే నార్డ్ స్ట్రీమ్ (Nord Stream) పైపులైన్లలో వరుస లీకేజీలు కలవరపెడుతున్నాయి. తాజాగా దక్షిణ స్వీడన్లో నాలుగో లీకేజీని గుర్తించారు. ఇప్పటివరకు కనుగొన్న నాలుగు లీకేజీలు కూడా అంతర్జాతీయ నీటి మార్గంలోనే ఉన్నాయి. ఇందులో రెండు లీకేజీలు స్వీడన్ సమీపంలోవి కాగా.. మరో రెండు డెన్మార్క్ సమీపంలో ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది.
భారీ పేలుడు వల్లే ఈ లీకేజీలు సంభవించాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తొలి పేలుడు డెన్మార్క్లోని బార్న్హామ్ ద్వీపంలో జరిగినట్లు నిపుణులు గుర్తించగా, రెండో పేలుడు అక్కడి ఈశాన్య ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్నారు. ఇవి 2.3 భూకంప తీవ్రతకు సమానమని అన్నారు. అనంతరం డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ ప్రాంతాల్లోనూ ఇదే విధమైన పేలుళ్లు చోటుచేసుకున్నాయని అక్కడి భూకంప అధ్యయన కేంద్రాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి యూరప్నకు తరలించేందుకు ఏర్పాటు చేసిన నార్డ్స్ట్రీమ్ (Nord Stream) 1 మూతబడింది. నార్డ్స్ట్రీమ్ 2 ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ, ఈ రెండు పైపులైన్లలో నిండుగా ఉన్న గ్యాస్ ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తమ దేశాల్లో జరుగుతోన్న లీకేజీలు విద్రోహ చర్యేనని డెన్మార్క్, స్వీడన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. రష్యా గ్యాస్కు ప్రత్యామ్నాయంగా నార్వే నుంచి పోలెండ్కు సహజవాయువును తీసుకొచ్చే బాల్టిక్ పైపునకు ప్రారంభోత్సవం జరిగిన సమయంలోనే నార్డ్ స్ట్రీమ్ పైపులైన్లలో లీకేజీలు తలెత్తడం కాకతాళీయం కాదనీ, ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంస చర్యేనని ఆరోపిస్తున్నాయి. ఈ లీకేజీల విడుదలయ్యే వాయువు వాతావరణంపై ప్రభావాన్ని చూపడంతో పాటు సముద్ర జీవులకు కూడా ముప్పుగా మారనుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్దేశపూర్వకమైనవేనన్న నాటో..
నార్డ్ స్ట్రీమ్లో వరుసగా చోటుచేసుకుంటున్న లీకేజీలు విధ్వంసంలో భాగమేనని నాటో కూటమి పేర్కొంది. ఇవి ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా, బాధ్యతారహితమైనవన్న నాటో.. వాతావరణ ముప్పునకు ఇవి కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి మూలాలను తెలుసుకొనేందుకు కొనసాగుతోన్న దర్యాప్తునకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా తమ భాగస్వామ్య దేశాలు, వాటి కీలక వ్యవస్థలపై జరిగే దాడులను తిప్పికొడతామని నాటో కూటమి స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్