Bird flu: 53 ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ..!
పక్షుల్లో కనిపించే బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు మానుషులకు సంక్రమిస్తోంది. చిలీలో 53 వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటంతో తొలి కేసుగా నమోదు చేశారు.
చిలీ: సాధారణంగా పక్షులకు సంక్రమించే బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాధి ప్రస్తుతం మానవుల్లో కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్, చైనాలో ఈ రకమైన కేసులు నమోదుకాగా.. తాజాగా చిలీ ( Chile)లో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. 53 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధికి సంబంధించిన అనేక లక్షణాలు బయటపడ్డాయి. దేశంలో బుధవారం మొదటి కేసు నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) వెల్లడించింది. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఇది ఒక అంటువ్యాధి అని, కోళ్లు వంటి పక్షులు, సముద్ర జీవుల నుంచి ఈ వ్యాధి మానవులకు సంక్రమిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే మనిషి నుంచి మనిషి సంక్రమిస్తుందా ? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో వ్యాధి సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
వన్య జంతువుల్లో H5N1 బ్లడ్ఫ్లూ లక్షణాలు ఉన్నయానే విషయాన్ని చిలీ గతేడాది నివేదించింది. కేసుల సంఖ్య పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం ఇటీవల కోళ్ల పరిశ్రమల నుంచి ఎగుమతులను సైతం నిలిపివేసింది. అర్జెంటీనాలోని పౌల్ట్రీలో కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగుమతిదారు బ్రెజిల్లో మాత్రం ఈ వ్యాధి కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది ప్రారంభంలో ఈక్వెడార్లోని 9ఏళ్ల బాలికలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. పరిశీలించిన అధికారులు ఇది ఇతర వ్యక్తుల నుంచి సంక్రమించిందని ధృవీకరించారు. అయితే మానవుల మధ్య సంక్రమణ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉందని గ్లోబల్ హెల్త్ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీదారులు మానవుల కోసం బర్డ్ ఫ్లూ టీకాలను తయారు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?