China: చైనా సరిహద్దులకు ఆరు సైనిక డివిజన్లను తరలించిన భారత్..!
వాస్తవాధీన రేఖ వెంబటి చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్లు లేకపోవడంతో భారత్ కీలక చర్యలు తీసుకొంది. పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లద్ధాక్ సెక్టార్ నుంచి
ఇంటర్నెట్డెస్క్: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్లు లేకపోవడంతో భారత్ కీలక చర్యలు తీసుకొంది. పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లద్దాఖ్ సెక్టార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మోహరించింది. గతంలో భారత సైన్యం పాక్ వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేది. కానీ, ఇప్పుడు చైనా నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో దళాల మోహరింపుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆర్మీచీఫ్గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల లద్దాఖ్లో పర్యటించి దళాల మోహరింపును సమీక్షించారు. చైనాతో సరిహద్దు వివాదం మొదలై దాదాపు రెండేళ్లు పూర్తైనా ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు.
తాజా మార్పుల్లో భాగంగా జమ్ము-కశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలను అణచి వేసే రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఓ డివిజన్ను తూర్పు లద్ధాఖ్ ప్రాంతానికి పంపించారు. ఇప్పటికే మూడు డివిజన్లు అక్కడ విధులు నిర్వహిస్తున్నాయి. హరియాణలోని స్ట్రైక్ కోర్ నుంచి ఒక డివిజన్ను ఉత్తరాఖండ్కు తరలించారు. వన్ స్ట్రైక్ కోర్కు చెందిన మరో రెండు డివిజన్లు కూడా లద్దాఖ్కు వెళ్లాయి. గతంలో ఇవి పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వహించేవి. దీంతోపాటు 17 మౌంటెన్ స్ట్రైక్ కోర్కు ఝార్ఖండ్ నుంచి ఒక డివిజన్ను పంపించారు. అస్సాంలో మరో డివిజన్కు చైనా సరిహద్దుల బాధ్యతలు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.