Yarshagumba: ‘హిమాలయన్ వయాగ్రా’ కోసం వెళ్లి.. మంచుకొండల్లో ఆరుగురు గల్లంతు
హిమాలయన్ వయాగ్రాగా (Himalayan Viagra) పిలిచే ఓ మూలిక కోసం వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. నేపాల్లోని హిమాలయ ప్రాంతంలో (Himalayan Mountains) మంచుతుపాను రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాఠ్మాండూ: హిమాలయాల్లో (Himalayan Mountains) పర్వతారోహకుల సాహస యాత్రలే కాకుండా ఎంతో విలువైన మూలికల కోసం అక్కడి స్థానికులు పర్యటిస్తుంటారు. ఇందుకోసం మంచుకొండల్లో నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ‘హిమాలయన్ వయాగ్రా (Himalayan Viagra)’గా పిలిచే అత్యంత విలువైన మూలిక (Yarshagumba) తీసుకొచ్చేందుకు వెళ్లిన వారిలో కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్లో (Nepal) చోటుచేసుకుంది. హిమపాతంలో చిక్కుకున్న వారికోసం గాలింపు చేపట్టగా అందులో ఆరుగురి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు.
నేపాల్ ధార్చులా జిల్లాలోని కొండల్లో మంగళవారం నాడు భారీ హిమపాతం సంభవించింది. అదే సమయంలో యర్షగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచుతుపానులో గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అందులో కొందర్ని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. మరో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీల ఆచూకీ మాత్రం లభించలేదు. వారిని గాలింపు కోసం 25 మంది భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి పంపించినట్లు స్థానిక డీఎస్పీ దత్తా వెల్లడించారు. మరో ఘటనలో యర్షగుంబా తీసుకువచ్చేందుకు వెళ్లిన మరో మహిళ కూడా హిమపాతంలో మునిగిపోయిందని బజ్హింగ్ జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఆమె గాలింపు కోసం ప్రత్యేక బృందాన్ని పంపించామని అన్నారు.
యర్షగుంబా (Yarshagumba) అనేది హిమాలయాల్లో లభించే అత్యంత విలువైన మూలిక. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను హిమాలయన్ గోల్డ్ లేదా గొంగళి పురుగు ఫంగస్ (Caterpillar Fungus)గా చెబుతుంటారు. హిమాలయ ప్రాంతంలో అత్యంత అరుదుగా లభించే ఈ ఫంగస్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఈ మూలికల్లో ఉంటుందని భావిస్తుంటారు. అందుకే దీనిని ‘హిమాలయన్ వయాగ్రా (Himalayan Viagra)’గా పేర్కొంటారు. నేపాల్ మార్కెట్లోనే దీని ధర గ్రాముకు రూ.50వేలకు పైగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ మరింత ఎక్కువ. ఈ మూలిక కోసం చైనా సైనికులు భారత భూ భాగంలోకి పదేపదే చొరబాట్లకు పాల్పడుతుంటారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’