Congo: కాంగో.. మిలీషియా దాడిలో 60 మంది మృతి!

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో మిలీషియా సభ్యులు భీకర దాడులకు తెగబడుతున్నారు.

Published : 03 Feb 2022 02:31 IST

వలసదారు శిబిరంపై మిలీషియా సభ్యుల దాడి

కిన్షాసా: డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో మిలీషియా సభ్యులు భీకర దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అక్కడ వలసదారుల శిబిరంపై దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో దాదాపు 60 మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇటూరీ ప్రావిన్సుల్లో సావో శిబిరంలో జరిగిన ఈ మారణహోమానికి మిలీషియా సభ్యులే బాధ్యులని అక్కడి స్థానిక మానవ హక్కుల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

గతకొన్నేళ్లుగా ఇటూరీ ప్రావిన్సులో తలదాచుకున్న వందలాది మంది వలసదారులను మిలీషియా దళాలు చంపినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటికే వేల మంది పౌరులు తమ నివాసాలను ఖాళీచేసి వెళ్లిపోయినట్లు తెలిపాయి. తాజాగా జరిగిన ఘటన కూడా శిబిరాల నుంచి వలసదారులను వెళ్లగొట్టే లక్ష్యంతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, ప్రస్తుతం సావో వలసదారుల శిబిరంలో 4వేల మంది తలదాచుకుంటున్నట్లు ఐరాస వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఈ దాడులు మరింత ఎక్కువైనట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని