Russia: ఇన్స్టాగ్రాంకు 8 కోట్ల మంది రష్యన్లు దూరం..!
సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విటర్లపై రష్యా నిషేధం విధించగా.. తాజాగా ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్పైనా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియా దిగ్గజాలపై రష్యా నిషేధం
మాస్కో: ఉక్రెయిన్పై సైనిక చర్యకు పాల్పడుతోన్న రష్యా.. సోషల్ మీడియా దిగ్గజాలపై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విటర్లపై నిషేధం విధించగా.. తాజాగా ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్పైనా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్, పొలాండ్ దేశాల్లో పుతిన్ మరణానికి పిలుపు నిచ్చేందుకు ఫేస్బుక్ అనుమతి ఇచ్చిందన్న (నిబంధనలను సడలిస్తూ) వార్తల నేపథ్యంలో ఈ యాప్పై నిషేధం విధిస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఇన్స్టాగ్రామ్పై సోమవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. అయితే, రష్యా ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 8 కోట్ల మంది ఇన్స్టా యూజర్లు ఈ యాప్కు దూరం కానున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.
ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా ఇప్పటికే ఆయా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిపనిలో నిమగ్నమయ్యాయి. అదే బాటలో పలు అంతర్జాతీయ సంస్థలు కూడా చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ద్వేషపూరిత ప్రసంగాలపై ఉన్న నిబంధనలను సడలిస్తూ ఇటీవలే ఫేస్బుక్ నిర్ణయం తీసుకుంది. తద్వారా ‘రష్యా ఆక్రమణదారులకు మరణం తప్పదు’ అనే పదాలను అనుమతించినట్లయ్యింది. ఈ విషయాన్ని మెటా అధికార ప్రతినిధులు కూడా ఇటీవలే ధ్రువీకరించారు. అయితే ఇటువంటి వ్యాఖ్యలు రష్యన్ పౌరులపై హింసను అనుమతించినట్లు కాదని స్పష్టం చేశారు. తాజాగా ఇన్స్టాగ్రామ్పై రష్యా నిషేధం విధించడంపై ఆ సంస్థ చీఫ్ అడమ్ మొస్సెరీ స్పందించారు. ‘రష్యాలో సోమవారం నుంచి ఇన్స్టాగ్రాంపై నిషేధం కొనసాగనుంది. ఈ నిర్ణయంతో 8కోట్ల మంది రష్యన్లకు ప్రపంచ ఇన్స్టాగ్రామ్ వినియోగదారులతో దూరం కానున్నారు. ఇది తప్పుడు నిర్ణయం’ అని అడమ్ మొస్సెరీ ట్విటర్లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై రష్యాలోని మీడియా నియంత్రణ విభాగం స్పందించింది. హింసాత్మక చర్యలకు పిలుపునిచ్చేందుకు అనుమతి ఇస్తున్నందున ఇన్స్టాగ్రాంను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్తోపాటు, ట్విటర్లను నిషేధాన్ని ఇప్పటికే అమలు చేస్తోన్న రష్యా.. మెటా సంస్థకే చెందిన వాట్సాప్పై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM