Crime News: కాల్ సెంటర్లో దారుణం.. ఉద్యోగం మానేస్తున్నారని 8 మంది హత్య!
ఓ కాల్సెంటర్లో (Call Center) పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు తమ జాబ్ మానేసేందుకు సిద్ధమైన క్రమంలో హత్యకు గురైన ఘటన మెక్సికోలో (Mexico) చోటుచేసుకుంది.
మెక్సికో సిటీ: మెక్సికోలో (Mexico) దారుణం చోటుచేసుకుంది. కాల్సెంటర్లో (Call Center) ఉద్యోగం మానేసేందుకు సిద్ధమైన ఎనిమిది మంది యువతీ, యువకులను చంపిన ఘటన కలకలం రేపుతోంది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు (Real Estate Scam) పాల్పడుతున్న మెక్సిన్లోని ఓ డ్రగ్ కార్టెల్లో (Drug cartel) జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని అమెరికా, మెక్సికో అధికారులు ధ్రువీకరించారు.
మెక్సికోలోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్ కార్టెల్ ఆధ్వర్యంలో ఆ కాల్సెంటర్ నడుస్తోంది. మెక్సిలోనే అత్యంత హింసాత్మక ముఠాగా జలిసోకు పేరుంది. అయితే, అందులో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు. మే 20-22 మధ్యకాలంలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల జాడ కనిపించలేదు. వారంతా 30ఏళ్లలోపు వారే. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. వీటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా.. అవన్నీ తప్పిపోయిన ఆ కాల్ సెంటర్ ఉద్యోగులవేనని తేలింది.
మెక్సికోలో అత్యంత హింసాత్మక గ్యాంగ్గా పేరున్న ఈ జలిసో కొత్త తరం ముఠా.. సాధారణ కార్యకలాపాలు కాకుండా డ్రగ్స్ అక్రమరవాణా, దోపిడీ, కిడ్నాప్ల వంటి వాటికి పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లే లక్ష్యంగా ఈ కాల్సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. అయితే, అందులో పనిచేసే యువతీ, యువకుల దారుణ హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వారంతా ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తున్నందునే ఈ దారుణాలకు తెగబడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగుల కుటుంబీకులు మాత్రం తమ పిల్లలు సాధారణ కాల్సెంటర్లోనే పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని దర్యాప్తు సంస్థలకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్