Ukraine Crisis: ఉక్రెయిన్పై పుతిన్ లెక్క తప్పింది.. తక్కువగా అంచనా వేశారు..!
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడిచేస్తున్నారని.. ఉక్రెయిన్ ప్రజల హృదయాలను
అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పక్కా ప్రణాళికతోనే ఉక్రెయిన్పై యుద్ధానికి దిగారని, అయితే ఆయన విసిరిన సవాల్ను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేగాక, ఉక్రెయిన్పై పుతిన్ అంచనాలు తప్పాయని అంటూ ఆ దేశ ప్రజల మనోధైర్యాన్ని ప్రశంసించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
‘‘నియంతలు వారి దూకుడు చర్యలకు మూల్యం చెల్లించకపోతే వారు మరింత గందరగోళానికి కారణమవుతారు. అప్పుడు అమెరికాతో పాటు ప్రపంచానికి కూడా ముప్పు పెరుగుతుందని చరిత్ర చెబుతోంది. అందుకే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో స్థిరత్వం, శాంతి స్థాపన కోసం నాటో కూటమిని ఏర్పాటు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తోన్న పుతిన్ ఇప్పుడు ఉక్రెయిన్పై ఉద్దేశపూర్వకంగానే, పక్కా ప్రణాళికతో యుద్ధానికి దిగారు. దౌత్యపరమైన పరిష్కార యత్నాలకు కూడా ఆయన (పుతిన్) అంగీకరించడం లేదు. నాటో, పశ్చిమ దేశాలు స్పందించవేమో అని ఆయన అనుకుంటున్నారు. మమ్మల్ని(నాటో కూటమి) విడదీయొచ్చని పుతిన్ భావిస్తున్నారు. కానీ పుతిన్ ఆలోచన తప్పు. ఆయన విసిరిన సవాల్ను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని బైడెన్ స్పష్టం చేశారు.
యుద్ధంలో ఉక్రెయిన్తో పాటు అమెరికా సేనలు పోరాడవని, అయితే నాటో సభ్యుల భూభాగాలపై దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని బైడెన్ రష్యాను హెచ్చరించారు. ఈ యుద్ధం వల్ల రష్యాకే భారీ నష్టం వాటిల్లుతుందని, ఆ దేశం మరింత బలహీనమవుతుందని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ను తక్కువగా అంచనా వేశారు..
ఈ సందర్భంగా పుతిన్పై బైడెన్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘ఉక్రెయిన్పై యుద్ధంలో పుతిన్ లెక్క తప్పింది. ఆ దేశాన్ని తక్కువగా అంచనా వేశారు. తాను ఉక్రెయిన్లోకి సులువుగా వెళ్లగలనని అనుకున్నారు. కానీ ఆయన ఎన్నడూ ఊహించని ఓ మనో స్థైర్యాన్ని (ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని ఉద్దేశిస్తూ) ఢీ కొట్టారు. ఉక్రెయిన్ ప్రజలను ఢీకొట్టారు’’ అని బైడెన్ తెలిపారు. పుతిన్.. ఉక్రెయిన్ను సైన్యంతో చుట్టుముట్టినా.. ఆ దేశ ప్రజలను మాత్రం గెలుచుకోలేరని అన్నారు.
రష్యా విమానాలపై నిషేధం..
ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న యుద్ధానికి ప్రతిస్పందన.. ఆ దేశంపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు బైడెన్ వెల్లడించారు. ‘‘ఇప్పటికే అమెరికా, తన మిత్ర దేశాలతో కలిసి రష్యాపై శక్తిమంతమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇప్పుడు అమెరికా గగనతలంలోకి రష్యా విమానాలు రాకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘పుతిన్ ఓ నియంత. రష్యా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఉక్రెయిన్ ప్రజలతో అమెరికా ఉంది. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయి. యుద్ధ రంగంలో పుతిన్ లాభపడొచ్చు. కానీ.. దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అని బైడెన్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM