రష్యాతో చర్చలకు సిద్ధం.. ఉక్రెయిన్ ప్రకటన
రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.
కీవ్: రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు బెలారస్ వేదికగా కాకుండా సరిహద్దు ప్రాంతంలో పరస్పరం చర్చించేందుకు అంగీకరించారు. ఈ విషయంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఫోన్లో మాట్లాడిన ఆయన.. చర్చలకు ఒప్పుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్ష భవనం వెల్లడించింది. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృథా చేస్తోందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ నుంచి ఈ ప్రకటన వెలువడం గమనార్హం.
‘ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దు ప్రాంతమైన ప్రిప్యాట్ నది సమీపంలో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపనున్నాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండానే చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే, చర్చలకు బయలుదేరే సమయం మొదలు, చర్చలు జరిగే సమయం, తిరిగి వచ్చే వరకూ బెలారస్లోని అన్ని రకాల విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఎగరకుండా చూసే బాధ్యతను బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీసుకున్నారు’ అని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు తొలి అడుగు పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రష్యా చేపట్టిన సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తుండడంతో ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా వెల్లడించింది. ఇందుకు బెలారస్లోని గోమెల్లో చర్చిద్దామని ఉక్రెయిన్కు తెలిపింది. అయితే, రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. బెలారస్లోని పలు ప్రాంతాల నుంచే తమ దేశంపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతుందన్న ఆయన.. తమపై దాడి చేయని దేశాల్లో మాత్రమే చర్చిస్తామని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి తమ నిర్ణయాన్ని సమీక్షించుకున్న ఉక్రెయిన్.. చివరకు బెలారస్ సరిహద్దు ప్రాంతంలో చర్చించేందుకు అంగీకరించింది.
ఇదిలాఉంటే, తమ దేశంపై దాడుల నేపథ్యంలో రష్యాను ఐరాస భద్రతామండలి నుంచి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్పై జరుగుతోన్న సైనిక చర్య ‘మారణహోమం’తో సమానమన్నారు. రష్యా తప్పుడు మార్గంలో వెళ్తున్నందున యూఎన్ఎస్సీలో దాని స్థానాన్ని తొలగించాలన్నారు. ఉక్రెనియాపై దాడులను అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ ద్వారా దర్యాప్తు చేయించాలని, వాటిని ఉగ్రవాద చర్యలుగా పరిగణించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సైనిక చర్యను వెంటనే ఆపివేసేలా రష్యాను ఆదేశించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.