Earthquake: భూకంప శిథిలాల కిందే జననం.. ఆ పాపే ఓ ‘అద్భుతం’..!
తుర్కియే, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం(Earthquake) పెనువిషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి విలయంతో హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
డమాస్కస్: తుర్కియే(Turkey), సిరియా(Syria)లో ప్రకృతి ప్రకోపానికి ఆర్తనాదాలు ఆగడం లేదు. పేకమేడల్లా కూలిన భవనాల కింద మెలిపెట్టే కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలా కూలిన ఓ భవనం కిందే భూమ్మీదకు అడుగుపెట్టింది అయా(Aya). ఈ భూప్రళయం(Earthquake)లో తల్లిదండ్రులు, తోబుట్టువుల ఆయువు గాల్లో కలవగా.. ఈ పాప కొత్త ఊపిరి పోసుకుంది. ఆ పసికందు చిత్రాలు వైరల్గా మారడంతో.. తనను దత్తత చేసుకునేందుకు వేలాది మంది ముందుకు రావడం విశేషం.
తుర్కియే(Turkey), సిరియా(Syria)లో సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంప తీవ్రతకు నిద్రలోనే ఎన్నో ప్రాణాలు పోయాయి. అలా సిరియాలోని జిండిరెస్ ప్రాంతంలో ఓ నిండు గర్భిణి తన కుటుంబంతో పాటే చిక్కుకుపోయింది. అప్పుడే ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసం తీవ్ర ఆవేదన చెందింది. ఆ ఉలిక్కిపాటుతో ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. చావు అంచుల్లోనూ ప్రసవ వేదన భరిస్తూ.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అప్పటికే సత్తువ కోల్పోయి, ప్రాణాలు విడిచింది. భూకంపం వచ్చిన దాదాపు పది గంటల తర్వాత శిథిలాల కింద పాప ఏడుపు శబ్దం విన్న సహాయక సిబ్బందికి తల్లిపక్కనే బొడ్డుతాడుతో ఉన్న పసికందు కనిపించింది. తల్లిని కదిలిస్తే.. అచేతనంగా ఉంది. దాంతో వారు ఒక్క ఉదుటున ఆ పసికందును రక్షించి, ఆసుపత్రికి చేర్చారు.
ఏడుపు వినిపించగానే.. మొదట ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తి మట్టిలో ఉన్న చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు. గడ్డకట్టే చలిలో ఇంకొకరు తనని దుప్పటిలోకి తీసుకోగా.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు మరొకరు అంతే వేగంగా వాహనం తీసుకువచ్చారు. శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో, గాయాలతో ఆసుపత్రికి చేరింది. అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వారే ఆ బిడ్డకు అయా అని పేరుపెట్టారు. ఆ పేరుకు అర్థం ‘అద్భుతం’ అని. అవును.. ఆ బిడ్డ జననం చూస్తుంటే అదే అనిపిస్తోంది మరి. ఇప్పటికే ఇల్లు కోల్పోయిన ఆమె బంధువుల కుటుంబం.. ఆ చిన్నారిని చూసుకునేందుకు ముందుకు వచ్చింది. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది ఆ పాపను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడి భార్య ఆ శిశువుకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ దేశాల్లో నిర్వహిస్తోన్న సహాయకచర్యలకు.. విపరీతంగా కురుస్తున్న మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు కూడా ముగియడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడుతారన్న ఆశలు క్షణక్షణానికి సన్నగిల్లుతున్నాయి. అలాగే అయా మాదిరిగానే ఎంతో మంది చిన్నారులు అయిన వారిని పోగొట్టుకొని అనాథలుగా మారిపోయారు. భూకంప(Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 21 వేల మరణాలు నమోదుకాగా.. వీరిలో సిరియాలో 3 వేల మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా