Pakistan: పాక్ పెద్దలు.. స్విస్బ్యాంకులో దాచేశారు..!
పాకిస్థాన్ పెద్దలుగా చలామణీ అయిన కొందరి అవినీతి వ్యవహారాన్ని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పెద్దలుగా చలామణీ అయిన కొందరి అవినీతి వ్యవహారాన్ని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. 1,400 మందికి చెందిన 600 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రస్తుతం బయటకు పొక్కాయి. అందులో ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుర్ రహమాన్ ఖాన్ సహా ఇతర జనరల్స్, బడా నేతల ఖాతాలున్నాయి. స్విట్జర్లాండ్లో రిజిస్టర్ అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ నుంచి ఈ వివరాలు లీక్ అయ్యాయి. దానికి సంబంధించి వెలువడిన నివేదికపై పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి.
అఫ్గానిస్థాన్లో రష్యాకు వ్యతిరేకంగా ముజాహిదీన్లు చేస్తోన్న పోరాటానికి మద్దతుగా అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చిన డబ్బు, తదితరాలను అందించడంలో రహమాన్ ఖాన్ సహాయం చేశాడని ఆ నివేదికను ఉటంకిస్తూ న్యూయార్క్ కథనం పేర్కొంది. ముజాహిదీన్ల కోసం కోసం సౌదీ అరేబియా, యుఎస్ నుంచి వచ్చిన నిధులు అమెరికన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) స్విస్ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయని డాన్ వార్తాపత్రిక నివేదించింది. ఈ ప్రక్రియలో చివరి గ్రహీత పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఎస్ఐ). ఆ సమయంలో ఐఎస్ఐకు రహమాన్ ఖాన్ నేతృత్వం వహిస్తున్నారని నివేదికను ఉటంకిస్తూ పేర్కొంది.
ఇక స్విట్జర్లాండ్లో పాకిస్థానీలు కలిగిఉన్న సగటు గరిష్ఠ నిల్వ 4.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్లని మరో కథనం పేర్కొంది. వారిలో కొందరు రాజకీయ నాయకులుగా చలామణీ అవుతూ ప్రభుత్వ పదవుల్లో ఉన్పప్పటికీ.. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఈ ఖాతా వివరాలు పేర్కొనలేదు. 2016లో పనామా పేపర్లు, 2017లో ప్యారడైజ్ పేపర్లు, గతేడాది పండోర పేపర్ల తర్వాత తాజా లీకుల వ్యవహారం బయటకు వచ్చింది. ఈ సారి 18,000 కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాల డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. వాటి విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉందని సమాచారం. మరిన్ని ఖాతాలు ఉండటంతో మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.