Missile: పోలండ్లో పేలిన క్షిపణి.. ఉక్రెయిన్ నుంచి దూసుకెళ్లింది..!
ఉక్రెయిన్ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో పోలండ్లోని ఓ గ్రామంలోకి క్షిపణి దూసుకువచ్చిందని ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇది ఉక్రెయిన్ నుంచి వచ్చిన క్షిపణేనని ప్రాథమికంగా తెలిసింది.
వార్సా: రష్యా-ఉక్రెయిన్ యద్ధంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ జి-20 సదస్సులో మాట్లాడుతున్న వేళ.. ఆ దేశంపై క్షిపణులు వర్షం కురిసింది. వాటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆ క్రమంలో క్షిపణి ఒకటి పొరుగున ఉన్న పోలండ్ దేశంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఇది రష్యా నుంచి వచ్చిందని మొదట వార్తలు వచ్చినా.. అది ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణేనని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఉక్రెయిన్ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో పోలండ్లోని ఓ గ్రామంలోకి క్షిపణి దూసుకువచ్చిందని ఆ దేశ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇది రష్యాలో తయారైన క్షిపణి అని తెలిపింది. అలాగే ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని తమ దేశంలోని రష్యా రాయబారికి సమన్లు జారీచేసింది. అయితే దీనిని రష్యా ఖండించింది. ఇదంతా ఉద్రిక్త పరిస్థితులను మరింత రెచ్చగొట్టే చర్య అంటూ నిందించింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అమెరికా, ఐరోపా సమాజం సహా పలు దేశాలు జి-20 సదస్సులో బిజీగా ఉన్నాయి. ఈ వార్తతో అమెరికా అధ్యక్షతన జి-20 దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. అలాగే రష్యా నుంచి ప్రయోగించిన క్షిపణి వల్ల ఈ ఘటన చోటుచేసుకొని ఉండకపోవచ్చని ప్రాథమికంగా తెలుస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పోలండ్లో మిలిటరీని హై అలర్ట్లో ఉంచారు.
స్పందించిన ఉక్రెయిన్..
ఈ ఘటనపై మంగళవారం జెలెన్స్కీ రష్యాపై విమర్శలు గుప్పించారు. ‘రష్యా క్షిపణులు పోలండ్లోకి దూసుకెళ్లాయి. మరణాలు చోటుచేసుకున్నాయి. ఇది కీలక ఉద్రిక్త పరిస్థితి. నాటో దేశంపై రష్యా క్షిపణి పేలడం అనేది సామూహిక భద్రతపై దాడి’ అని తన దేశ ప్రజలతో వ్యాఖ్యానించారు. మరోపక్క ఉక్రెయిన్ నుంచి ఈ క్షిపణి వచ్చిందన్న తాజా నివేదికలపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇది కుట్ర సిద్ధాంతం అంటూ వాటిని కొట్టిపారేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM