BJP MLA: ముందస్తు బెయిల్ విచారణ అంత త్వరగానా..? సీజేఐకు న్యాయవాద సంఘం లేఖ
లంచం కేసులో (Corruption Case) ప్రధాన నిందితుడిగా ఉన్న భాజపా ఎమ్మెల్యే (Virupakshappa) ముందస్తు బెయిల్ పిటిషన్ను అత్యంత త్వరగా విచారించడంపై బెంగళూరు న్యాయవాద సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వీఐపీల కేసులకు ప్రాధాన్యం కల్పించడాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి (CJI) లేఖ రాసింది.
బెంగళూరు: లంచం కేసులో (Corruption Case) ఏ1గా ఉన్న కర్ణాటక భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పకు (Virupakshappa) ముందస్తు బెయిల్ పిటిషన్ త్వరగా విచారణకు రావడంపై బెంగళూరు న్యాయవాద సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాసింది. వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించిన న్యాయవాద సంఘం.. అందరికీ సమన్యాయం ఉండాలంటూ అందులో పేర్కొంది.
‘కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ వంటి కొత్త అంశాలకు సంబంధించిన పిటిషన్లు విచారణకు వచ్చేందుకు చాలా రోజులు, కొన్ని వారాలు పడుతుంది. కానీ, వీఐపీ విషయాల్లో మాత్రం ఇవి రాత్రికి రాత్రే విచారణకు వస్తాయి. సామాన్యులకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయేందుకు ఈ తరహా సంఘటనలు దారి తీస్తాయి. ఎమ్మెల్యేను కూడా సాధారణ పౌరుడి మాదిరిగానే చూడాలి’ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో కర్ణాటక అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు వివేక్ సుబ్బారెడ్డి, జనరల్ సెక్రటరీ టీజీ రవి నేతృత్వంలోని అడ్వకేట్ అసోసియేషన్ పేర్కొంది.
మరోవైపు ముందస్తు బెయిల్పై వచ్చే దరఖాస్తులన్నీ ఒకేరోజు విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖలోనూ బెంగళూరు అడ్వకేట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. తద్వారా సామాన్యులను కూడా వీఐపీగా పరిగణించవచ్చని పేర్కొంది. కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త చేతికి చిక్కిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్పకు ముందస్తు బెయిల్ మంజూరు కావడాన్ని న్యాయవాద సంఘాలు తీవ్రంగా పరిగణించాయి.
ఇదిలాఉంటే, ఎమ్మెల్యే విరూపాక్షప్ప తరఫునే ఆయన కుమారుడు ప్రశాంత్ లంచం తీసుకున్నారని లోకాయుక్త అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షప్పను ఏ1గా చేర్చింది. అదుపులోకి తీసుకునేందుకు లోకాయుక్త ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో తన పాత్ర లేదంటూ హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోగా.. దానిని విచారించిన జస్టిస్ కే నటరాజన్ ఏకసభ్య ధర్మాసనం ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..