Bangladesh: గ్రిడ్ వైఫల్యం.. 13 కోట్ల మందికి కరెంట్ కట్!
బంగ్లాదేశ్(Bangladesh)లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ(Grid Failure) కుప్పకూలింది. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 13 కోట్ల మందికి కరెంటు లేకుండా పోయిందని ప్రభుత్వ విద్యుత్ సంస్థ తెలిపింది.
ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh)లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ(Grid Failure) కుప్పకూలింది. మంగళవారం మధ్యాహ్నం దాదాపు 13 కోట్ల మందికి కరెంటు లేకుండా పోయిందని ప్రభుత్వ విద్యుత్ సంస్థ తెలిపింది. స్థానిక కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దేశంలో 80 శాతానికి పైగా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఆకస్మిక అంతరాయం ఏర్పడిందని పవర్ డెవలప్మెంట్ బోర్డు వెల్లడించింది. వాయువ్య బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలు మినహాయించి.. మిగతా దేశమంతా కరెంట్ పోయిందని బోర్డు ప్రతినిధి షమీమ్ ఎహసాన్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. 13కోట్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారన్నారు. ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని.. ఈ అంతరాయానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదన్నారు. బహుశా సాంకేతిక లోపాలు కారణం కావచ్చని అంచనా వేశారు.
దాదాపు 2.2 కోట్ల మంది నివసించే దేశ రాజధాని ఢాకా పరిధిలో రాత్రి 8గంటలనాటికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మంత్రి జునైద్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రస్తుత జనాభా దాదాపు 16.51 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో.. అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల కారణంగా బంగ్లాదేశ్ ఇటీవలి నెలల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. విద్యుత్ డిమాండ్ కోసం దిగుమతి చేసుకున్న డీజిల్, గ్యాస్ ధరల చెల్లింపులు.. ప్రభుత్వానికి భారంగా మారాయి. మరోవైపు.. కరెంట్ కోతలపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్లో చివరిసారి 2014 నవంబర్లో భారీ బ్లాక్ అవుట్ ఏర్పడింది. ఆ సమయంలో దేశంలో దాదాపు 70 శాతం మందికి దాదాపు 10 గంటలపాటు విద్యుత్ సౌకర్యం లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!