Rohingya: వలస జీవుల వ్యథ.. నడి సంద్రంలోనే నెల రోజులు చిక్కుకొని!
ఆహారం, నీళ్లు లేక ఓ చిన్నపాటి పడవపైనే అండమాన్ సముద్రంలో నెలరోజులపాటు కొట్టుమిట్టాడిన ఓ రోహింగ్యా శరణార్థుల బృందం.. చివరకు ఇండోనేసియాకు చేరుకుంది. వీరిని కాపాడిన స్థానిక అధికారులు.. తాత్కాలిక ఆశ్రయం కల్పించారు.
జకర్తా: వారంతా శరణార్థులే(Refugees). పొట్టచేతబట్టుకుని పొరుగు దేశాలకు వలసవెళ్దామనుకున్నారు. సముద్రం దాటేందుకు ఓ చెక్క పడవను ఆశ్రయించారు. కానీ, మధ్యలోనే ఇంజిన్ పనిచేయకుండా పోయింది. దీంతో నడి సంద్రంలో నిస్సహాయంగా మిగిలిపోయారు. కనుచూపు మేర నీళ్లే. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నెలరోజులపాటు ఉన్నారు! గాలులతో అటూఇటూ కొట్టుకుపోయిన పడవ.. చివరకు ఇండోనేసియా(Indonesia) తీరానికి చేరుకుంది. 57 మంది రోహింగ్యా(Rohingya) వలస జీవులతో కూడిన ఓ పడవ.. ఇక్కడి అషే బేసర్ తీరానికి చేరుకుందని స్థానిక అధికారులు ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. నెల రోజులపాటు తాము అండమాన్ సముద్రం(Andaman Sea)లోనే కొట్టుమిట్టాడినట్లు వారు చెప్పారన్నారు.
ఈ శరణార్థులను తాత్కాలికంగా ప్రభుత్వ ఆవాసంలో ఉంచుతామని స్థానిక ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు. సముద్రంలో సుదీర్ఘ ప్రయాణంతోపాటు ఆహారం లేక.. వారంతా బలహీనంగా మారారని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని చెప్పారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే, వీరు ఎక్కడినుంచి వచ్చారో తెలియాల్సి ఉందన్నారు. వారం రోజుల క్రితం సముద్రంలో చిక్కుకుపోయిన 150 మంది రోహింగ్యాల బృందానికి చెందినవారా అనేది స్పష్టంగా తెలియలేదని చెప్పారు. ఆహారం, నీళ్లు అయిపోయిన ఆ చిన్న పడవలోని వ్యక్తులను రక్షించాలంటూ ఐరాస ఇప్పటికే.. ఆగ్నేయాసియాలోని అండమాన్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలను కోరింది.
వాస్తవానికి రోహింగ్యాలు.. మయన్మార్లో నివసిస్తుంటారు! కానీ, సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకుగానూ లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్కు తరలిపోయారు. మయన్మార్లో గతేడాది సైనిక తిరుగుబాటు అనంతరం.. వారి వలసలు మరింత పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వారంతా.. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. తాజాగా 57 మంది శరణార్థులు చేరుకున్న ఇండోనేసియా తీరం.. బంగ్లాదేశ్కు 1900 కి.మీల దూరంలో ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్