Turkey Tragedy: తుర్కియేలో భయం భయం.. ఇస్తాంబుల్కు భూకంప ముప్పు
తుర్కియే (Turkey)లో సంభవించిన భూకంప ప్రళయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే శాస్త్రవేత్తల హెచ్చరికలు మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తుర్కియేలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్(Istanbul)లోనూ భూకంపం సంభవించే అవకాశముందని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇస్తాంబుల్: భూ ప్రకంపనలతో గజగజ వణికిపోయిన తుర్కియే(Turkey)ను ఆ భయం వీడడం లేదు. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటికే వేల మందిని పొట్టన పెట్టుకోగా.. భూకంప అధ్యయన శాస్త్రవేత్తలు (Seismologists) చేస్తున్న హెచ్చరికలు అక్కడున్న వారిని మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తుర్కియేలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ (Istanbul)లోనూ భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నగరంలో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 20 మిలియన్లకు చేరే అవకాశముందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ భూకంపం సంభవిస్తే ప్రాణనష్టం ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రజలు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
1999లో ఇస్తాంబుల్ తూర్పు ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 17,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇస్తాంబుల్లో నివసిస్తున్న వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తూ, పాత నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాల్లోని ప్రజలకు ఇతర ప్రాంతాల్లో నివాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని మురత్ గునే అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇస్తాంబుల్లో ఇటీవల నిర్మించిన భవనాలు ఎక్కువగానే ఉన్నాయని, భూమి కంపించినా తట్టుకునేలా బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
7.6 తీవ్రతతో భూకంపం!
దాదాపు 7.6 తీవ్రతతో ఇస్తాంబుల్లో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నట్లు గునే అభిప్రాయపడ్డారు. అదే జరిగితే వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భూకంప తీవత్ర కారణంగా బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యే సూచనలున్నాయి. ప్రమాదాన్ని ముందుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోకపోతే దాదాపు 50,000 మంది నుంచి 2,00,000 మరణాలు సంభవించే అవకాశముంది’’ అని గునే ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. అంతేకాకుండా ఇస్తాంబుల్లోని చాలా భవనాలు భూకంపాలను తట్టుకోలేని స్క్వాటర్ స్టైల్లో నిర్మించి ఉండటం వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
నష్టాన్ని నివారించాలంటే..!
ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 38 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. అంతేకాకుండా 55 వేలకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. మరెన్నో భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు ఇలాంటి పరిస్థితులే ఇస్తాంబుల్లోనూ సంభవించ వచ్చని గునే హెచ్చరించారు. ఆ నగరంలో దాదాపు 11,66,000లకు పైగా భవనాలు ఉన్నట్లు చెప్పిన ఆయన.. దాదాపు 8,17,000లకు పైగా భవనాలు 1999 సంవత్సరానికి ముందే నిర్మించినట్లు తెలిపారు. అయితే, భూకంప పరిస్థితులను తట్టుకునే విధంగా 2008 తర్వాత నిర్మించిన 1,50,000లకు పైగా భవనాలు ఇప్పటికీ ఖాళీగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే ఒక వేళ భూకంప ప్రళయం సంభవించినా.. మరణాల సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..