Flight Journey: తరగతి తగ్గిస్తే టికెట్లో 75శాతం వెనక్కి.. ఫిబ్రవరి 15 నుంచి అమలు
టికెట్ డౌన్గ్రేడ్ విషయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రయాణ సమయంలో ఒకవేళ తరగతి మారిస్తే.. సదరు ఎయిర్లైన్స్ టికెట్ ధరలో 75శాతం వెనక్కి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ తెలిపింది.
దిల్లీ: విమాన ప్రయాణికులకు ఊరట కలిగించే విషయం. తీసుకున్న టికెట్ కంటే తక్కువ క్లాస్కు తగ్గించిన (Ticket Downgrades) సందర్భాల్లో ప్రయాణికుడు ఆ టికెట్ ధరలో 75శాతం తిరిగి పొందే వెసులుబాటు త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటిని సదరు ఎయిర్లైన్స్ చెల్లించేలా నిబంధనల్లో మార్పులు తేవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాల్లో మాత్రం ఈ రీఇంబర్స్మెంట్ 30 నుంచి 75శాతం వరకు ఉండనుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు డీజీసీఏ సీనియర్ అధికారులు వెల్లడించారు.
ఒక క్లాస్లో విమాన టికెట్ బుక్ చేసుకుంటే.. ఒక్కోసారి ప్రయాణ సమయానికి అది తక్కువ తరగతికి విమానయాన సంస్థలు మారుస్తున్నాయనే ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిబంధనలు డీజీసీఏ మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ విమాన ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా తరగతి మార్చితే.. టికెట్ మొత్తాన్ని (పన్నులతో సహా) విమానయాన సంస్థ తిరిగి ప్రయాణికుడికి చెల్లించాలని డీజీసీఏ గత డిసెంబర్లో ప్రతిపాదించింది. అంతేకాకుండా అటువంటి ప్రయాణికుడికి తదుపరి తరగతిలో (కింది క్లాస్లో) ఉచితంగా తీసుకెళ్లాలని పేర్కొంది.
అయితే, అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమలు అవుతోన్న నిబంధనలను పరిశీలించిన డీజీసీఏ.. వాటిలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ప్రయాణికుడికి కల్పించే సదుపాయాలకు చెందిన సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (CAR) నిబంధనలను మార్చింది. అంతర్జాతీయ ప్రయాణ దూరం 1500 కి.మీ లేదా అంతకన్నా తక్కువ ఉంటే టికెట్లు ధరలో 30శాతం, 1500 కి.మీ నుంచి 3500 కి.మీ మధ్య దూరం ఉంటే 50శాతం, 3500 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న సమయంలో 75శాతం తిరిగి చెల్లించాలని డీజీసీఏ నిర్దేశించింది. దేశీయ ప్రయాణంలో టికెట్ డౌన్గ్రేడ్ చేస్తే మాత్రం 75శాతం తిరిగి ప్రయాణికుడికి చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య