Asteroid: లక్ష్యం లేకుండా సంచరిస్తున్న భారీ గ్రహశకలం.. భూమికి సమీపంగా వస్తోందట!
అమెరికా (America) అంతరిక్ష సంస్థ నాసా (NASA) భూమికి (Earth) అతి సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో (Asteroid) ఓ జాబితాను తయారు చేసింది. అందులోని గ్రహశకలం ‘2023 ఎస్ఎన్6’ తాజాగా మన భూగ్రహం దిశగా దూసుకొస్తున్నట్లు సమాచారం అందింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షంలో (Space) లక్ష్యం లేకుండా సంచరిస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని (Asteroid) శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఒక స్థిర మార్గం, గమ్యం లేకుండా ప్రయాణించడం ఆందోళనకు గురిచేస్తోంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ ‘కాస్మిక్ నొమాడ్’ కొన్ని సార్లు ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలకు దగ్గరగా వస్తున్నట్లు తెలిసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భూమికి అతి సమీపంగా వెళ్లే గ్రహశకలాలతో ఓ జాబితాను తయారు చేసింది. ఆ జాబితాలోని గ్రహశకలం ‘2023 ఎస్ఎన్6’ తాజాగా మన భూగ్రహం దిశగా దూసుకొస్తున్నట్లు సమాచారం అందింది.
2040 నాటికి చంద్రుడిపై 3డీ ఇళ్ల నిర్మాణం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నాసా
ఒక విమానం పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం బుధవారం భూమిని దాటనుంది. అది 4.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ గ్రహశకలం గంటకు 30,564 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని నాసా డేటా పేర్కొంటోంది. ఇది భూమికి సమీపంలోని గ్రహశకలాల అపోలో సమూహానికి చెందినది. 1862 అపోలో గ్రహశకలాలను జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ రీన్ముత్ 1930 ప్రాంతంలో కనుగొన్నాడు. అయితే, స్పేస్ ఏజెన్సీస్ సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ (సీఎన్ఈఓఎస్) మాత్రం తాజా గ్రహశకలాన్ని ప్రమాదకర వస్తువుగా భావించడం లేదు.
2022లో నాసా భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలాన్ని మళ్లించేందుకు ఓ ప్రత్యేక మిషన్ను చేపట్టింది. దానికి డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) అని పేరు పెట్టింది. తొలి దశలో 2022 సెప్టెంబరు 26న నాసా శాస్త్రవేత్తలు పంపించిన స్పేస్ క్రాఫ్ట్ లక్షిత గ్రహశకలం డైమోర్ఫోస్ను ఢీకొంది. క్యూబ్ ఆకృతిలో కన్పించే నాసా వాహనం దాదాపు ఓ వెండింగ్ మిషన్ పరిమాణంలో ఉండేది. అది భూమికి 11 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలంలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
జర్మనీ(Germany)కి ఖతార్ నుంచి దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? లేదా..? తెలియాల్సి ఉంది. -
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు. -
Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే దేశ మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
Israel-Hamas: ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు
Israel-Hamas: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలికంగా కుదిరిన సంధి గడువు ముగిసింది. దీంతో గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. -
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. -
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా