Imran Khan: ‘జైలు టు బెయిల్’.. ఇమ్రాన్ అరెస్టులో కీలక పరిణామాలివే!
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ మంజూరైంది. అయితే, అరెస్టు నుంచి బెయిల్ మంజూరు వరకు చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ను (Imran Khan) అరెస్టు చేయడం అక్రమమని పాక్ సుప్రీం (Pak Supreme Court) కోర్టు గురువారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ ఆయనకు రెండు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఇమ్రాన్ జైలుకు వెళ్లిన నాటి నుంచి బెయిల్ మంజూరు చేసే వరకు చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఓసారి పరిశీలిస్తే..
- అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ను మంగళవారం పాక్ రేంజర్లు ఇస్తామాబాద్ హైకోర్టు (IHC) ఆవరణలోనే అరెస్టు చేశారు.
- ఐహెచ్సీ ఆదేశాల మేరకు ఇమ్రాన్ను బుధవారం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ)కు అప్పగించారు.
- ఇమ్రాన్ అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు మంగళవారం నుంచే దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగారు.
- నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్, పంజాబ్, బలోచిస్థాన్ తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించింది.
- దాదాపు 3000 మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను, పార్టీ కార్యకర్తలను పాక్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ జైళ్లలో నిర్బంధించారు.
- నిరసనలు హింసాత్మకంగా మారి.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులు ట్రక్కులకు, కార్లకు నిప్పంటించారు. ఈ ఘటనల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు.
- ఈ పరిస్థితులు 2007 ఎన్నికల ర్యాలీలో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య తర్వాత పాక్లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులను తలపించాయి. భుట్టో హత్య తర్వాత ఆమె మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి లోనై.. పాకిస్థాన్ వ్యాప్తంగా రోజుల తరబడి విధ్వంసం సృష్టించారు.
- హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో గురువారం పాక్ పోలీసులు ఇమ్రాన్ ఖాన్పై ఉగ్రవాద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
- పాక్ రేంజర్లు అరెస్టు చేసి ఎన్ఏబీకి అప్పగించిన తర్వాత గురువారం ఇమ్రాన్ఖాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన అరెస్టు అక్రమమని ప్రకటించింది.
- ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించి.. న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా నడచుకోవాలని ఇమ్రాన్కు పాక్ సుప్రీం కోర్టు సూచించింది.
- సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. గురువారం రాత్రి ఇమ్రాన్ కాన్ ఇస్లామాబాద్లోని ప్రభుత్వ అతిథి గృహంలోనే ఉన్నారు. అక్కడే కుటుంబ సభ్యులను, స్నేహితులను, మద్దతుదారులను కలిశారు. పాక్ అధ్యక్షుడు అరిఫ్ ఆల్వి కూడా ఇమ్రాన్తో మాట్లాడారు.
- సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం విచారణ చేపట్టిన ఐహెచ్సీ ప్రత్యేక ధర్మాసనం.. ఇమ్రాన్కు 2 వారాల బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ