Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
తెలుగు సంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది మొదటి రోజును ఉగాది పండుగ చేసుకుంటారు. మరి, పర్షియన్, ఇరానీయన్ సంస్కృతిలో కొత్త ఏడాదిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రజలు జనవరి 1న కొత్త ఏడాది (New Year) శుభాకాంక్షలు చెబుతూ సంబరాలు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కొత్త సంవత్సరాది ప్రారంభమయ్యే రోజును ఉగాది (Ugadi) పండుగగా నిర్వహిస్తారు. తెలుగువారికి ఉగాది ఉన్నట్లుగానే.. ఇరానీయన్ సంస్కృతిలో నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజును ‘నౌరుజ్’(Nowruz) అని పిలుస్తారు. నౌరుజ్ అంటే ‘కొత్త రోజు’ అని అర్థం. మంగళవారం నౌరుజ్కు గుర్తుగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కొత్త డూడుల్ను ఆవిష్కరించింది. మూడువేల సంవత్సరాల కిత్రం ఇరాన్, ఇరాక్, అఫ్గానిస్థాన్, తుర్కియే, సిరియా దేశాల్లోని పార్శీలతో పాటు కొన్ని వర్గాల వారు హిజ్రీ క్యాలెండర్ ప్రకారం శీతాకాలం పూర్తయి.. వసంత కాలం ఆరంభమయ్యే రోజున ఈ పండుగ జరుపుకొంటారు. ఆ రోజున వారంతా నౌరుజ్ వేడుకలు నిర్వహించేవారు. ఇప్పటికీ ఆయా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
గూగుల్ నౌరుజ్ సందర్భంగా గూగుల్ ప్రదర్శించిన డూడుల్ను వసంత కాలంలో విరిసే తులిప్, హైసింత్, డాఫోడిల్స్, బీ ఆర్కిడ్స్ పుష్పాలతో డిజైన్ చేశారు. ఐక్యరాజ్య సమితి (UN) సైతం నౌరుజ్ను అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఈ పర్వదినాన్ని మధ్య, పశ్చిమాసియా ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా నిర్వహిస్తారు. ‘‘గడిచిన కాలంలో స్మృతులను గుర్తుచేసుకుంటూ.. భవిష్యత్తుపై ఆశలతో బంధువులు, స్నేహితులతో బంధాలను మరింత బలోపేతం కావాలని పండుగ సందర్భంగా కోరుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త జీవితానికి గౌరవ సూచకంగా ఇళ్లను గుడ్లతో అలంకరించి.. కూరగాయలు, మూలికలతో విందు నిర్వహిస్తారు’’ అని గూగుల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ ప్రజలు నౌరుజ్ వేడుకను నిర్వహిస్తారని అంచనా. భారత్లో పార్శిలు పవిత్రమైన రోజుగా నౌరుజ్ను భావిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే