Jill Biden: పాక్ ‘ఐఎస్ఐ’ రాడార్లోకి బైడెన్ భార్య..!
అమెరికా నిఘా, భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసింది. ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులను
వాషింగ్టన్: అమెరికా నిఘా, భద్రతా విభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసింది. ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అరెస్టు చేసింది. వీరిద్దరు గత కొన్ని నెలల నుంచి అమెరికాలో నకిలీ ధ్రువపత్రాలతో ఫెడరల్ ఏజెంట్ అధికారులుగా చలామణి అయినట్లు తెలిసింది. అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ భద్రతా వ్యవహారాలు చూసే భద్రతా విభాగంలోకి చొరబడేందుకు వీరు ప్రయత్నించినట్లు సమాచారం.
అరియన్ తాహిర్జాదే, హైదర్ అలీ.. పాకిస్థాన్లోని ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరూ డిపార్ట్మెంట్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) యూనిట్లో పనిచేస్తున్నామంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకున్నారు. 2021లో జరిగిన క్యాపిటల్ హిల్ అల్లర్ల కేసు దర్యాప్తు కోసం అండర్కవర్ ఆపరేషన్ సాగిస్తున్నట్లు నమ్మించారు. దీని ద్వారా ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్, డిఫెన్స్ కమ్యూనిటీకి చెందిన పలువురితో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు.
వీరిద్దరూ వాషింగ్టన్లోని చాలా అపార్ట్మెంట్ ప్రాంగణాలపై నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తెలిసింది. ఎఫ్బీఐ, డీహెచ్ఎస్, యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్(యూఎస్ఎస్ఎస్)లో పనిచేసే సిబ్బంది నివాసముండే అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. అంతేగాక, ఈ విభాగాల్లో పనిచేసే కొందరు సిబ్బందికి ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి వారిని తమ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
వైట్హౌజ్లో పనిచేసే ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్కు ఏడాది పాటు అద్దె లేకుండా అపార్ట్మెంట్ రెంట్కు ఇచ్చినట్లు తెలిసింది. ప్రథమ మహిళ జిల్ బైడెన్ భద్రత విభాగంలో పనిచేసే ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్కు కూడా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ ఇద్దరితో సంబంధాలు నడిపిన నలుగురు సీక్రెట్ సర్వీస్ సభ్యులను అడ్మినిస్ట్రేషన్ లీవ్లో పంపించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుల్లో ఒకరి వద్ద పాకిస్థాన్, ఇరాన్ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలీ గతంలో ఇస్తాంబుల్, దోహా, టర్కీకి వెళ్లినట్లు విచారణలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే