Military Drills: ఉత్తర కొరియా దూకుడు.. జపాన్, అమెరికాల దీటైన స్పందన!
ఒకవైపు ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం.. దీనికి దీటుగా అమెరికా, జపాన్ల ఉమ్మడి సైనిక విన్యాసాలతో శుక్రవారం జపాన్ సముద్ర జలాలు వేడెక్కాయి! ఉత్తర కొరియా తాజాగా ప్రయోగించిన క్షిపణి 15 వేల కి.మీల దూరం ప్రయాణించగలదని.. అమెరికా ప్రధాన భూభాగం కూడా దీని పరిధిలోకి రాగలదని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా చెప్పారు.
టోక్యో: ఒకవైపు ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ICBM) ప్రయోగం.. దీనికి దీటుగా అమెరికా, జపాన్ల ఉమ్మడి సైనిక విన్యాసాలతో శుక్రవారం జపాన్ సముద్ర జలాలు వేడెక్కాయి! ఉత్తర కొరియా(North Korea) తాజాగా ప్రయోగించిన క్షిపణి 15 వేల కి.మీల దూరం ప్రయాణించగలదని.. అమెరికా ప్రధాన భూభాగం కూడా దీని పరిధిలోకి రాగలదని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా చెప్పారు. ప్యోంగ్యాంగ్నుంచి దూసుకెళ్లిన ఈ క్షిపణి.. 6,100 కి.మీ ఎత్తుకు చేరుకుందని, వెయ్యి కి.మీల దూరం ప్రయాణించిందని దక్షిణ కొరియా ఆర్మీ తెలిపింది. ఇది జపాన్ సముద్రంలోని ఆ దేశ ప్రత్యేక ఆర్థిక మండలి(EEZ) పరిధిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లు వేర్వేరుగా ఈ ప్రయోగాన్ని ఖండించాయి.
ఈ క్రమంలోనే అమెరికా, జపాన్లు సైతం జపాన్ సముద్ర గగనతలంపై ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టాయి. టోక్యో రక్షణశాఖ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘జపాన్ చుట్టూ భద్రతా పరిస్థితులు తీవ్రంగా మారుతోన్న పరిణామాల మధ్య.. జపాన్, అమెరికా సాయుధ దళాలు ద్వైపాక్షిక సైనిక కసరత్తులు నిర్వహించాయి’ అని తెలిపారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అమెరికా- జపాన్ల సంకల్పాన్ని ఈ విన్యాసాలు చాటుతాయని వెల్లడించారు. దీంతోపాటు ఇవి తమ సైనిక సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తాయని చెప్పారు. కొరియా ద్వీపకల్పం చుట్టూ అమెరికా సైనిక కార్యకలాపాలను నిరసిస్తూ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం