Washington: వాషింగ్టన్లో ఇక బస్సు ప్రయాణం ఉచితం!
ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాషింగ్టన్ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై త్వరలోనే ఓటింగ్ జరగనుంది.
వాషింగ్టన్: ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాలు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ బస్సు సేవలను ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదిత బిల్లుకు చట్టసభ సభ్యులు అంగీకారం తెలపగా.. డిసెంబర్ 20న కౌన్సిల్ సభ్యులు తుది ఓటింగ్ నిర్వహించనున్నారు. దీంతో 2023 నుంచి ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కరోనా మహమ్మారి అనంతరం రోజువారీ ఖర్చులు పెరగడం, దీనికి తోడు ప్రయాణ ఛార్జీలు కూడా అధికమవడంపై అమెరికన్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజా రవాణా సేవలను ఉచితంగా అందించడం లేదా ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో కరోనా కారణంగా వాషింగ్టన్లో మెట్రో ఛార్జీలను కొంతకాలం (2020-2021) మాఫీ చేశారు. కానీ, మళ్లీ వాటిని పెంచడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు. అయితే, తక్కువ ఆదాయం ఉన్న పౌరులను దృష్టిలో ఉంచుకొని ప్రజా రవాణాను ఉచితంగా అందించేందుకు తాజాగా బిల్లును తీసుకువస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్పందించిన కేజ్రీవాల్..
మన దేశంలోనూ ఉచితాలపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్లో ఉచితంగా బస్సు సేవలు అందించడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఉచితాలపై రద్దాంతం చేసే కొన్ని పార్టీలు.. దీన్ని కూడా హేళన చేస్తాయా? అని ప్రశ్నించారు. పౌరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉత్తమమైందంటూ ప్రశంసించారు. ఇప్పటికే దిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం అందిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్