Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా..!’ బైడెన్ వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు కెనడా పార్లమెంటు వేదికగా.. చైనాను ప్రశంసించడం గమనార్హం. అయితే, కెనడా బదులుగా ఆయన చైనా అని పొరపాటుగా పలకడం దీనికి కారణమైంది.
అటావా: అమెరికా(America), చైనా(China)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆయా అంశాలపై ఇరు దేశాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటాయి. అలాంటిది.. ఏకంగా అమెరికా అధ్యక్షుడే చైనాను ప్రశంసించడం గమనార్హం! అదీ.. కెనడా(Canada) పార్లమెంటు వేదికగా. అయితే, కెనడాకు బదులుగా ఆయన చైనా అని పొరపాటుగా పలకడమే దీనికి కారణం. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జో బైడెన్(Joe Biden) తొలిసారి కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడా పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఇందులో భాగంగా కెనడా వలస విధానాలపై మాట్లాడుతూ.. పొరపాటున చైనాను మెచ్చుకున్నారు. ‘వలసల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నందుకు.. చైనాను అభినందిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. వెంటనే, జరిగిన పొరపాటుకు నాలుక కర్చుకున్న బైడెన్.. ‘క్షమించండి.. కెనడాను అభినందిస్తున్నా’ అని అన్నారు. దీంతో పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. తన పొరపాటును సరిదిద్దుకుని.. ‘చైనా గురించి నేనేం ఆలోచిస్తున్నానో మీరు చెప్పగలరు. ఇంకా ఈ విషయంలో వెళ్లదల్చుకోలేదు’ అంటూ బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
దక్షిణ అమెరికా దేశాల నుంచి ఏటా 15 వేల మంది వలసదారులను అనుమతించేందుకు కెనడా ఇటీవల ముందుకొచ్చింది. ఈ విషయంలో కెనడాను ప్రశంసించే క్రమంలో ఈ పొరపాటు దొర్లింది. అయితే, ‘అమెరికాకు ఎంత ఇబ్బందికర పరిస్థితి ఇది’ అని బైడెన్ వ్యాఖ్యపై డొనాల్డ్ ట్రంప్ తనయుడు ఎరిక్ ట్రంప్ స్పందించారు. ఆయన మనస్సులో చైనా ఉందంటూ అమెరికా చట్టసభ్యుడు బైరాన్ డొనాల్డ్స్ ట్వీట్ చేశాడు. అంతకుముందు జోబైడెన్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో కలిసి.. ‘అంతర్జాతీయ వ్యవస్థకు చైనా ఓ దీర్ఘకాలిక సవాలుగా మారింది’ అని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి