H-1B Visa: మార్చి 1 నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్..!
అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీచేసే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది.
వెల్లడించిన యూఎస్సీఐఎస్
దిల్లీ: అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీచేసే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. మార్చి 1 నుంచి మార్చి 18వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కోటా కింద జారీ చేసే ఈ వీసాల కోసం (myUSCIS) ఆన్లైన్ ద్వారా ఆయా సంస్థలు, ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూఎస్సీఐఎస్ తాజా ప్రకటనలో వెల్లడించింది.
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ కోసం పది డాలర్ల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 18 వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి ర్యాండమ్ పద్ధతిలో (లాటరీ ద్వారా) వీటిని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 31నాటికి సమాచారం అందిస్తారు. వీసా పొందిన నిపుణులు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వీలుంటుంది.
ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారు అమెరికాలో పనిచేసేందుకు గానూ అక్కడి ప్రభుత్వం ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాను జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రతిఏటా కొత్తగా దాదాపు 65వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తుంది. నాన్ ఇమిగ్రేషన్ (అమెరికాలో కొంతకాలం ఉండేందుకు) కింద ఇచ్చే హెచ్-1బీ వీసాలు పొందే వారిలో ఎక్కువగా భారతీయులే ఉండడం గమనార్హం. ఈ వీసా పొందే వారిలో దాదాపు 70శాతం మంది లబ్ధిదారులు భారత్ నుంచే ఉంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం ఎంతోమంది భారతీయ వృత్తి నిపుణులు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది హెచ్1-బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..