Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
ఓ రష్యన్ వ్యాపారవేత్త నుంచి జప్తు చేసిన ఆస్తిని అమెరికా తొలిసారి ఉక్రెయిన్ సాయానికి వినియోగించనుంది. అగ్రరాజ్య అటార్ని జనరల్ ఈ మేరకు అధికారం కల్పించారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్- రష్యా యుద్ధాని(Ukraine Crisis)కి ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా(America) కీలక నిర్ణయం తీసుకుంది! తొలిసారి ఓ రష్యన్ వ్యాపారవేత్త ఆస్తులను ఉక్రెయిన్ సాయానికి వినియోగించనుంది. తమ ప్రభుత్వానికి ఈ మేరకు అధికారం ఇచ్చినట్లు అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్(Merrick Garland) తాజాగా వెల్లడించారు. ఇటువంటి నిర్ణయం ఇదే మొదటిసారని తెలిపారు. వాషింగ్టన్లో గార్లాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్లు సమావేశమైన క్రమంలో ఈ ప్రకటన వచ్చినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఆంక్షల ఎగవేత అభియోగాలపై రష్యన్ మిలియనీర్ కాన్స్టాంటిన్ మాలోఫీవ్(Konstantin Malofeev) నుంచి స్వాధీనం చేసుకున్న 5.4 మిలియన్ డాలర్ల సంపద నుంచి ఈ సాయం వెళ్తుందని గార్లాండ్ చెప్పారు.
ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆండ్రీ కోస్టిన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిధులను ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. ఉక్రెయిన్ పౌరులకు కలిగిన భారీ నష్టానికి పరిహారం అందేలా చూడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రష్యన్ మిలియనీర్ మాలోఫీవ్ను తూర్పు ఉక్రెయిన్లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు నిధులు సమకూర్చే ప్రధాన వనరుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఉక్రెయిన్పై సైనిక చర్య నేపథ్యంలో రష్యన్ సంస్థలు, పౌరులపై అమెరికా విధించిన ఆంక్షల జాబితాలో మాలోఫీవ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆంక్షలను అతిక్రమించేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అమెరికా ట్రెజరీ ఆయన బిజినెస్ నెట్వర్క్ను బ్లాక్లిస్ట్ చేసింది. ఆస్తులను జప్తు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.