America: కుమారుడికి కొవిడ్ పాజిటివ్.. కారు డిక్కీలో బంధించిన తల్లి
అమెరికాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానికులు పెద్దఎత్తున కరోనా పరీక్షలకు బారులు తీరుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళ.. పాజిటివ్గా తేలిన తన కుమారుడికి మరోసారి టెస్టు కోసం కారు డిక్కీలో బంధించి తీసుకురావడం...
వాషింగ్టన్: అమెరికాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానికులు పెద్దఎత్తున కరోనా పరీక్షలకు బారులు తీరుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళ.. పాజిటివ్గా తేలిన తన కుమారుడికి మరోసారి టెస్టు కోసం కారు డిక్కీలో బంధించి తీసుకురావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాను వైరస్ బారిన పడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు ఆమె పేర్కొనడం గమనార్హం. టెక్సాస్కు చెందిన సారా బీమ్ ఉపాధ్యాయురాలు. ఇటీవల హారిస్ కౌంటీలోని డ్రైవ్-త్రూ టెస్టింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే, ఆమె కారు డిక్కీలోంచి మాటలు రావడం గమనించిన ఓ మహిళ.. అక్కడున్నవారికి తెలిపారు. వారు ఈ విషయమై బీమ్ను నిలదీశారు. దీంతో ఆమె డిక్కీ తీయగా.. అందులోంచి 13 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. దీంతో కంగుతిన్న వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అతను తన కుమారుడని.. కొవిడ్ పాజిటివ్గా తేలడంతో, మరోసారి నిర్ధారణ కోసం పరీక్ష చేయించేందుకుగానూ తీసుకొచ్చినట్లు ఆమె అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో తనకు వైరస్ సోకకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. అయితే, అతన్ని కారు వెనుక సీటులో కూర్చోబెట్టుకునేవరకు టెస్టు నిర్వహించబోమని ఆ పరీక్ష కేంద్రం సిబ్బంది ఆమెకు స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. పూర్తి విచారణ జరిపారు. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.