MonkeyPox: మంకీపాక్స్పై ఆ మందులు పనిచేస్తున్నాయా?
మంకీపాక్స్పై ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ (Lancet)లో ప్రచురితమైన ఓ కథనం కొంత ఊరటనిస్తోంది.
దిల్లీ: కొవిడ్తో ఇంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను తాజాగా మంకీపాక్స్ (Monkeypox) కలవరానికి గురిచేస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ వ్యాధి క్రమంగా ఒక్కో దేశానికీ విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. మరోవైపు కరోనాలా ఇది కూడా మరో మహమ్మారి కానుందా? అనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ (Lancet)లో ప్రచురితమైన ఓ కథనం కొంత ఊరటనిస్తోంది.
కొన్ని యాంటీవైరల్ ఔషధాల (Antiviral Drugs)కు మంకీపాక్స్ (Monkeypox) లక్షణాలను తగ్గించే సామర్థ్యం ఉందని తమ పరిశోధనలో తేలినట్లు ‘లివర్పూల్ హాస్పిటల్స్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు’కు చెందిన పరిశోధకులు కథనంలో పేర్కొన్నారు. అలాగే ఈ ఔషధాలు తీసుకున్న వ్యక్తి నుంచి వ్యాధి మరొకరికి వ్యాపించే సమయం కూడా తగ్గిందని వెల్లడించారు. ఆసుపత్రిలో మంకీపాక్స్ సోకిన కొంతమందికి బ్రిన్సిడోఫోవిర్ (brincidofovir), టీకోవిరిమాట్ (tecovirimat) అనే రెండు యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఈ ఫలితాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిని స్మాల్పాక్స్ చికిత్సలో వినియోగిస్తారు. దీంట్లో బ్రిన్సిడోఫోవిర్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడించారు. టీకోవిరిమాట్పై ఇంకా లోతైన పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. మంకీపాక్స్ ఆనవాళ్లను రక్తం, గొంతు నుంచి తీసిన నమూనాల ద్వారా గుర్తించొచ్చని తెలిపారు.
మంకీపాక్స్ (Monkeypox) చికిత్సకు, వ్యాప్తి నియంత్రణకు ఇంకా నిర్ధిష్టమైన విధానాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. తాజా పరిశోధన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా మరింత లోతైన అధ్యయనం జరిపేవారికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా చూస్తే మంకీపాక్స్కు మనుషుల మధ్య వేగంగా వ్యాపించే సామర్థ్యం లేదన్నారు. అలాగే మొత్తంగా ప్రజారోగ్య వ్యవస్థలకు ఇది పెద్ద ముప్పేమీ కాకపోచ్చునని తెలిపారు. అయితే, కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. మరింత కచ్చితమైన సమాచారం రావాల్సి ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.