Ukraine: మేరియుపొల్ మారణకాండ.. థియేటర్ ఘటనలో 600 మంది మృతి..!
మేరియుపొల్ థియేటర్పై జరిగిన దాడిలో దాదాపు 600 మంది మృత్యువాతపడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది.
అంతర్జాతీయ వార్తాసంస్థ పరిశోధనలో వెల్లడి
లీవ్: రష్యా సైన్యం చేస్తోన్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు వణికిపోతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ సైన్యాన్నే కాకుండా అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకొని జరుపుతోన్న దాడుల్లో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మార్చి నెలలో మేరియుపొల్ థియేటర్పై జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. అయితే, ఆ ఘటనలో ఎంతమంది చనిపోయారన్న విషయం కచ్చితంగా తెలియనప్పటికీ దాదాపు 600 మంది మృత్యువాతపడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది.
ఉక్రెయిన్పై చేస్తోన్న భీకర యుద్ధంలో భాగంగా మార్చి 16న మేరియుపొల్లోని డొనెట్స్క్ అకాడెమిక్ రీజినల్ డ్రామా థియేటర్పై రష్యా సైన్యం దాడి జరిపింది. అప్పటికే ఆ థియేటర్లో 1200మంది పౌరులు తలదాచుకున్నట్లు సమాచారం. అయితే, ఆ దాడిలో భారీ భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఆ ఘటనలో మూడు వందల మంది చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ మృతుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదు. దీనిపై పరిశోధన చేపట్టిన అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ.. థియేటర్ లోపల, బయట మొత్తంగా 600 మంది చనిపోయినట్లు ఆధారాలు కనుగొన్నట్లు వెల్లడించింది. ఇదివరకు అంచనా వేసినదానికంటే మరణాల సంఖ్య రెట్టింపుగా ఉండడం కనీవిని ఎరగని మారణకాండకు సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొంది.
థియేటర్పై దాడి అనంతరం ఆరోజు అసలేం జరిగిందనే విషయంపై ఏపీ వార్తా సంస్థ పరిశోధన చేపట్టింది. ఆ దాడిలో ప్రాణాలతో బయటపడిన 23 మంది బాధితులు, రెస్క్యూ బృందాలు, ప్రత్యక్షసాక్షుల నుంచి వివరాలు సేకరించింది. వారు చెప్పిన వివరాల ప్రకారం భవనం 3డీ మోడల్ను రూపొందించి, థియేటర్ లోపల తీసిన ఫొటోలు, వీడియోలు సహాయంతో నిపుణుల ఆధ్వర్యంలో విశ్లేషించింది. ఇలా దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది తీవ్ర గాయాలపాలైనట్లు గుర్తించింది. మరోవైపు ఉక్రెయిన్ సేనలే థియేటర్పై దాడిచేసినట్లు రష్యా చేస్తోన్న వాదనను ఏపీ పరిశోధన బృందం ఖండించింది. థియేటర్లో ఉక్రెయిన్ బలగాలు ఉన్నట్లు ఎక్కడా వెల్లడికాలేదని.. రష్యా సైన్యం లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడిలోనే థియేటర్ ధ్వంసమైందని పేర్కొంది. ఈ దారుణ ఘటన ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు పౌరులపై జరిపిన దాడుల్లో అత్యంత ఘోరమైనదని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు