Russia: ‘పుతిన్ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
ఒకవేళ విదేశాల్లో పుతిన్ను అరెస్టు చేస్తే.. సంబంధిత దేశం రష్యాపై యుద్ధాన్ని ప్రకటించినట్లుగా భావిస్తామని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
మాస్కో: రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin)పై అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఆయనకు అరెస్టు ముప్పు లేనప్పటికీ.. ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే, విదేశాల్లో పుతిన్ను అరెస్టు చేయడమంటే.. సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్(Dmitry Medvedev) వ్యాఖ్యానించారు. విదేశాల్లో పుతిన్ అరెస్టు ప్రయత్నాలను ‘యుద్ధ ప్రకటన’గా చూస్తామని హెచ్చరించారు. అరెస్టు అసాధ్యమని పేర్కొంటూనే.. ఒకవేళ ఇదే జరిగితే రష్యన్ ఆయుధాలు ఆ దేశాన్ని తాకుతాయన్నారు.
‘పుతిన్ అరెస్టు అనేది ఎప్పటికీ జరగని పని. కానీ, ఒకసారి ఊహిద్దాం. జర్మనీకి వెళ్లిన సమయంలో పుతిన్ను అరెస్టు చేశారనుకుందాం. అంటే.. రష్యాపై జర్మనీ యుద్ధాన్ని ప్రకటించినట్లే’ అని మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. బుండెస్టాగ్(జర్మనీ పార్లమెంట్), ఛాన్స్లర్ కార్యాలయం తదితర ప్రదేశాల్లోకి మాస్కో రాకెట్లు, ఇతర ఆయుధాలు దూసుకెళ్తాయని చెప్పారు. ఐసీసీ ఇటీవలి నిర్ణయం.. పశ్చిమ దేశాలతో ఇప్పటికే దెబ్బతిన్న తమ సంబంధాలను మరింత దిగజార్చుతుందన్నారు. పుతిన్పై అరెస్టు వారెంటు చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్, ఇతర న్యాయమూర్తులపై రష్యా క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించిన వేళ మెద్వదేవ్ ఈ మేరకు స్పందించారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు పుతిన్ను బాధ్యుడిగా పేర్కొంటూ.. ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే, తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. క్షిపణులతో దాడి చేయగలమంటూ ఐసీసీకి మెద్వెదేవ్ ఇటీవల హెచ్చరికలు సైతం జారీ చేశారు. మరోవైపు.. పుతిన్పై వారెంట్కు వ్యతిరేకంగా వస్తోన్న బెదిరింపులపై ఐసీసీ స్పందించింది. అంతర్జాతీయ చట్టాల ఆధారంగా నిషేధిత కార్యకలాపాలపై తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు యత్నించడం విచారకరమని ఒక ప్రకటనలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.