Ukraine crisis: ‘ఉక్రెయిన్ కోసం నేను సైతం’.. ఏకే-47 పట్టిన 79 ఏళ్ల బామ్మ..!
‘‘నేను దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడం మాత్రం మానను. నా దేశాన్ని ఓడిపోనివ్వను’’..
యుద్ధంలో పోరాడుతామంటున్న వృద్ధులు, చిన్నారులు
ఇంటర్నెట్డెస్క్: ‘‘నేను దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడం మాత్రం మానను. నా దేశాన్ని ఓడిపోనివ్వను’’.. ఉక్రెయిన్కు చెందిన 79ఏళ్ల బామ్మ వాలెంటినా కోన్స్టాంటీనొవాస్కా ఉద్విగ్నంగా చెప్పిన మాటలివి. ఆమే కాదు.. ఉక్రెయిన్లో నాలుగేళ్ల చిన్నారి నుంచి వృద్ధుల వరకూ.. ఎవర్ని కదిలించినా ఇదే భావోద్వేగం. రష్యా ఆక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం అక్కడ చిన్నా పెద్దా కదిలి వస్తున్నారు. యుద్ధం ఎదురైతే ‘మేము సైతం’ అంటూ తుపాకులతో శిక్షణ తీసుకుంటున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లో దాదాపు లక్షన్నర మంది సైనికులను మోహరించింది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో ఉక్రెయిన్ సైన్యం సర్వ శక్తులతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆ దేశ ప్రజలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. సామాన్య పౌరులు కూడా ఆయుధాల వాడకంపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణకు చిన్నారులు, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
తూర్పు ఉక్రెయిన్లోని మరియుపోల్లో 79 ఏళ్ల వాలెంటినా కూడా ఈ ట్రెయినింగ్లో పాల్గొని జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే - 47 తుపాకీని ఎలా ఉపయోగించాలో శిక్షణ తీసుకున్నారు. తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వయసు కూడా పక్కనబెట్టి దేశం కోసం ముందుకొచ్చిన వాలెంటినాను ఉక్రెయిన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు.
‘‘ఏదైనా జరిగితే కాల్పులు జరిపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఇంటిని, నా పిల్లలను, నా నగరాన్ని నేను రక్షించుకుంటాను. నా దేశాన్ని ఎన్నటికీ ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వను. నేను బలహీనురాలినే కావొచ్చు. కానీ యుద్ధానికి సిద్ధమే’’ అని చెబుతూ వాలెంటినా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. ఆమెను చూసి యువత, ఇతర వృద్ధులు సైతం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు. తమ భవిష్యత్ తరం సమస్యలో చిక్కుకోకూడదంటే తాము యుద్ధం చేయాల్సిందే అంటున్నారు మరో బామ్మ మరియానా జాగ్లో. అటు చిన్న పిల్లలు కూడా ఆయుధాలు చేతబట్టి యుద్ధ శిక్షణ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా తాజాగా ప్రకటించడంతో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ నిన్న ప్రకటించింది. ఈ దళాలు ఎక్కడి నుంచి వెనుతిరుగుతున్నాయి.. ఎంత మంది సైనికులు వెనక్కి వచ్చేస్తున్నారన్న వివరాలను వెల్లడించలేదు. కానీ రష్యాను పశ్చిమ దేశాలు విశ్వసించడం లేదు. ఉక్రెయిన్పై పొంచి ఉన్న యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు. రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్